ఇటీవలే ‘మళ్ళీ రావా’ వంటి వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సుమంత్ కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టారస్ సినీకార్పు మరియు సుధాకర్ ఇంపెక్స్ ఐపీల్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి మరియు ధీరజ్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఈషా రెబ్బా హీరోయిన్. 

మనుషులపై ప్రేతాత్మలు పగబడితే దేవుడి దగ్గరకు వెళతారు! శరణు కోరతారు! మరి, దేవుడికి ఆగ్రహం వస్తే మనుషుల పరిస్థితి ఏంటి? అనే కథాంశంతో రూపొందుతోన్న సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’. సూపర్ నేచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఈ చిత్రమని మేకర్స్ తెలిపారు. పోస్టర్‌లో.. కామరూప మహా సామ్రాజ్యం, తారకాపురి, కుంతల రాజ్యం, త్రిలింగ దేశం, కర్మ రాష్ట్ర పేర్లు ఉన్నాయి. దీన్ని బట్టి ఇది సుబ్రహ్మణ్య స్వామి కథ నేపథ్యంలో తీస్తున్న చిత్రమని తెలుస్తోంది.
Image result for సుబ్రహ్మణ్యపురం
సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నవంబరులో విడుదల కానుంది. ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని గురించి నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఇందులో దేవుడిపై నమ్మకం లేని వ్యక్తిగా, నాస్తికుడిగా సుమంత్‌ నటిస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి కోసం, ఓ గ్రామం కోసం దేవుణ్ణి అతను ఎందుకు ఎదిరించాడు? అనేది చిత్రకథ.

ఇటీవల జరిగిన రెండో షెడ్యూల్‌లో యానాం, కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో చిత్రీరించాం. ఆగస్టు నెలాఖరుతో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు. సురేశ్‌, తనికెళ్ల భరణి, ‘జోష్‌’ రవి, భద్రమ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : శేఖర్‌ చంద్ర.   ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది’’ అని సుమంత్ తెలిపాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: