టాలీవుడ్ లో మహానటి చిత్రం సూపర్ హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు పెరిగిపోయింది.  ఈ చిత్రానికి మొదట తేజ దర్శకత్వం వహిస్తారని అనుకన్నా..ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.  ప్రస్తుతం ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించబోతున్నారు.  అయితే బయోపిక్ ను డీల్ చేయడం అంత సులభంకాదు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని బాలకృష్ణ చేయదలచుకున్నప్పటినుంచి రకరకాల మలుపులు తిరుగుతూనే ఉంది. మహానటి చిత్రం విడుదలై సక్సెస్ సాధించిన తర్వాత.. ఎన్టీఆర్ చిత్రాన్ని అటకెక్కించేస్తారేమో అనే పుకారు వచ్చింది. కానీ ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిసిన తర్వాత అంచనాలు పెరిగిపోతున్నాయి. 

ఇక మహానటి సినిమా రిలీజ్ అయిన తర్వాత బయోపిక్ సినిమాలపై భారీ అంచనాలు పెరిగిపోయాయి..అలాంటి సినిమాకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తుందని గ్రహించారు దర్శక, నిర్మాతు.  అంతే కాదు కలెక్షన్ల పరంగా కూడా ఎలాంటి ఢోకా లేదని గ్రహించారు.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఒకప్పటి సూపర్ స్టార్ సంజయ్ దత్ జీవితం ఆధారంగా రూపొందిన ‘సంజు’ చిత్రం తర్వాత.. ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ అయోమయంలో పడ్డట్లుగా కనిపిస్తోంది. ఆ చిత్రలో కూడా సంజయ్ దత్  ఉన్నత స్థాయి నుంచి  పతనాలను నిర్మొగమాటంగా చర్చిస్తూ మంచి మార్కులు కొట్టేశారు. ఇక మహానటి సినిమాలో కూడా సావిత్రి పాజిటీవ్, నెగిటీవ్ లో నిర్మోహమాటంగా చూపించారు.  

Related image

ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో మహానటుడిగా వెలిగిపోయి..రాజకీయాల్లో వన్నె తెచ్చిన ఆయన చివరి దశలో ద్వితీయ వివాహం చేసుకొని పతనం అయిన విషయాన్ని కూడా చూపిస్తారా అన్న విషయంపై రక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మహానటి తర్వాత.. ఓసారి అటకెక్కే ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఎన్టీఆర్ బయోపిక్, ఇప్పుడు సంజు తర్వాత మరోసారి అదే రకం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని.. సినిమాను ముందుకు తీసుకువెళ్దామా వద్దా అనే అయోమయం మీమాంసంలో కొట్టుమిట్టాడుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: