తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వస్తున్న బయోపిక్ చిత్రాలకు మంచి క్రేజ్ వస్తుంది. తెలుగులో ‘మహానటి’, బాలీవుడ్ లో ‘సంజు’ చిత్రాలకు సూపర్ హిట్ అయ్యాయి. ఇక తెలుగు లో మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తెలుగు తెరపై ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్లో హీరోయిన్ ఎవరనే విషయంపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఈ చిత్రంలో హీరోయిన్గా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కాకపోతే ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.
తాజాగా బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్కు విద్యాబాలన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముందు ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకొన్నది. విద్యాబాలన్ను కలువడానికి బాలకృష్ణ వెళ్లడం మీడియా వర్గాల్లో సెన్సేషన్గా మారింది. ఎన్టీఆర్ భార్య పాత్రలో నటించేందుకు విద్యాబాలన్ ఆలోచనలో పడ్డారట. కాగా, బసవతారకం పాత్రపై క్లారిటీ ఇచ్చేందుకు స్వయంగా విద్యాబాలన్ ఇంటికి బాలకృష్ణ వెళ్లడం కూడా జరిగింది.
తన తల్లి పాత్రకు సంబంధించిన అనేక విషయాలను విద్యాబాలన్కు పూసగుచ్చినట్టు చెప్పినట్టు సమాచారం.తన తల్లి బాసవతారకం పాత్ర గురించి బాలకృష్ణ వెల్లడించిన విషయాలు విని విద్యాబాలన్ ఎమోషనల్ అయినట్టు తెలిసింది. ఈ విషయానికి సంబంధించి బాలీవుడ్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
విద్యాబాలన్ తప్ప మరొకరు న్యాయం చేయలేరనే కారణంతో ఆమెను కలిశారు అని కథనంలో పేర్కొన్నారు. జూలై రెండోవారంలో హైదరాబాద్లోని రామకృష్ణ సినీ స్టూడియోలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకోనున్నది. సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్ ఇందూరి నిర్మాతలుగా వ్యవహరిస్తారు అని తరణ్ ఆదర్ష్ ట్వీట్ చేశారు.