తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ ఇప్పటికీ నాలుగో వారానికి చేరుకుంది. ఈసారి పదహారు మంది కంటెస్టంట్టు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చారు. వీరిలో పదమూడు మంది సెలబ్రెటీలు కాగా, ముగ్గురు కామన్ మాన్స్. ఇందులో సంజన, నూతన్ నాయుడు కామన్ మాన్స్ ఇప్పటికే ఎలిమినేట్ అవగా..గత వారం కిరీటి ఎలిమినేట్ అయ్యారు. వీరందరూ కామన్ గా బిగ్ బాస్ లో గతంలో మాదిరిగానే ఎలిమినేషన్ నాని చెప్పగా విన్నాం. కానీ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం ఎలిమినేషన్ బిగ్ బాస్ చేతిలోకి పోయింది.
ఎవరూ ఊహించని రీతిలో శ్యామల ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వారం ఎలిమినేషన్ రౌండ్లో శ్యామల, దీప్తి, నందిని, కౌశల్, బాబు గోగినేని, గణేశ్, తేజశ్వి ఉండగా, గణేశ్, బాబు గోగినేని, తేజశ్వి, కౌశల్ ప్రొటెక్టెడ్ జోన్లోకి వెళ్లారు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. చెరుకురసం టాస్క్లో బాగా ఆడినందుకు కౌశల్, తేజశ్వికి ఎక్కువ మార్కులు రావడంతో వారిద్దరికీ ప్రత్యేక అధికారం లభించింది. దీంతో ఎలిమినేషన్లో ఉన్న వారిలో వారిద్దరూ ఓటు వేయడం ద్వారా ఇద్దరిని రక్షించే అవకాశాన్ని బిగ్ బాస్ వారికి కల్పించాడు.
కౌశల్ తన ఓటును నందినికి వేసి ఎలిమినేషన్ నుంచి బయటపడేయగా, తేజశ్వి తన ఓటును దీప్తికి వేసింది. దీంతో శ్యామల ఎలిమినేషన్ ఖరారైంది. అనంతరం కౌశల్ మాట్లాడుతూ.. తన 11 ఏళ్ల బాబును వదిలిపెట్టి హౌస్ లోకి వచ్చి బాధపడుతున్న కారణంగానే ఆమెకు ఓటు వేయలేదని తెలిపాడు. దీనివల్ల ఆమె తన బిడ్డను కలుసుకునే అవకాశం వస్తుందన్నదే తన ఉద్దేశమని చెప్పాడు. ఇక శ్యామల బయటకు వెళ్లే సమయంలో దీప్తి చాలా ఎమోషన్ అయ్యింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ మాత్రం కాస్త కన్నీరు పెట్టించే విధంగా ఉంది.