ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం..ఇంట్లో అందరూ సందడి సందడిగా..ఇష్టాలు..కష్టాలు చర్చించుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేవారు.  ఈ మద్య ఉమ్మడి కుటుంబం వ్యస్థలు దాదాపు కనుమరుగయ్యాయి.  అపార్ట్ మెంట్ వ్యవస్థలు ఏర్పడిన తర్వాత భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే..ఇక వారి పరిస్థితి వేరే చెప్పాలా..ఎప్పుడో వీక్ ఎండ్ లో కలిసి మాట్లాడుకునే పరిస్థితి.  ఇక స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి.  ఫ్రెండ్స్, రిలేటీవ్ ఎవరైనా సరే ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అందులో ఛాటింగ్ చేస్తూ కాలం గడిపేస్తున్నారు. 
Image result for amitabh bachchan family
భారత దేశంలో బాలీవుడ్ సూపర్ స్టార్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..ఆయన కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా  బిగ్ బి అమితాబ్ బచ్చన్  ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రా‌మ్‌లో షేర్ చేసిన ఓ ఫొటో అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రస్తుత సమాజంలో కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయన్న విషయానికి ఇది అద్దం పడుతోంది. 
Image result for amitabh bachchan family
ఈ ఫోటోలో చిన్నారులు శ్వేతా బచ్చన్ నందా, అభిషేక్ బచ్చన్, మనవళ్లు నవ్యా నావెలి నందా, అగస్త్య తదితరులు ఉన్నారు. అందరూ ఒకే హాల్‌లో కూర్చుని ఉన్నారు. కానీ ఎవరికి వారే యమూనా తీరే అన్న చందంగా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. రూములో అంతమంది ఉన్నా ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కారణం.. ప్రతీ ఒక్కరి చేతుల్లోనూ మొబైల్ ఉంది.

అందరూ అందులోనే మునిగిపోయారు. తదేక దీక్షతో ‌మొబైల్‌ను ఆపరేట్ చేస్తూ ప్రపంచాన్ని మైమరచిపోయారు. ‘‘అందరూ ఒక చోటే ఉన్నారు. వారితో ఫోన్లు కూడా ఉన్నాయి’’ అంటూ అమితాబ్ తన ఫొటోకు క్యాప్షన్ రాశారు. అయితే, అందరూ స్మార్ట్‌ఫోన్‌లో మునిగిపోతే ఒక్క నవ్య ఒక్కర్తే పుస్తకం చదువుతూ కూర్చోవడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: