సినిమాలలోనే కాకుండా బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో కూడ జూనియర్ తన వేగం పెంచుతున్నాడు. ఇప్పటికే మలబార్ గోల్డ్ నవరత్న ఆయిల్ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జూనియర్ తన లేటెస్ట్ ఎండార్స్ మెంట్స్ లిస్టులో ‘సెలెక్ట్ మొబైల్స్’ సంస్థను కూడ చేర్చుకున్నాడు. ఈ సెల్ ఫోన్ రిటైల్ స్టోర్స్ చైన్ ను ప్రమోట్ చేస్తూ జరిగిన మీడియా సమావేశంలో తన కొడుకు అభయ్ రామ్ తెలివితేటల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు జూనియర్.
ఫోన్ లేకుండా ఉండటం కష్టం
తన మొట్టమొదటి సెల్ ఫోన్ ను భాగ్యనగరంలోని జగదీష్ మార్కెట్ లో కొనుక్కున్న విషయాన్ని వివరిస్తూ సెల్ ఫోన్ టెక్నాలజీ విషయంలో తనకు ఇప్పటికీ కొంత కన్ఫ్యూజన్ ఉన్నా తన కొడుకు అభయ్ రామ్ మాత్రం సెల్ ఫోన్ టెక్నాలజీ విషయంలో చాల ఫాస్ట్ గా ఉంటాడని అంటూ తన కొడుకు తెలివి తేటల పై ప్రశంసలు కురిపించాడు జూనియర్. ఐ ఫోన్ ఉపయోగించే విషయంలో అభయ్ స్పీడ్ ముందు తన స్పీడ్ సరిపోదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.  
ఎన్టీఆర్ బయోపిక్‌లో ఉన్నారా? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ అసంతృప్తి
అయితే ఈ ఐ ఫోన్ విషయంలోనే తన భార్య లక్ష్మీ ప్రణతికి తనకు అభిప్రాయ భేదాలు వస్తున్నాయని జోక్ చేస్తూ అభయ్ తరుచూ ఐ ఫోన్ పట్టుకుని ఫోటోలు తీస్తూ కాలం గడపడం తన భార్యకు ఏమాత్రం ఇష్టం ఉండదని చెపుతూ ఈవిషయంలో తాను అభయ్ ని ఎందుకు కట్టడి చేయడం లేదు అంటూ మండిపడుతుంది అంటూ తన ఇంటి విషయాలను బయటపెట్టాడు. ఇదే సందర్భంలో మరో షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు జూనియర్.
‘సెలక్ట్' మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది
సోషల్ మీడియాకు సంబంధించిన ట్విటర్  2.4 మిలియన్స్ ఫాలోయర్స్ ఉండటమే కాకుండా ఇదే సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ లో 2.6 లక్షల ఫాలోయర్స్ ను కలిగి ఉన్న జూనియర్ తాను సోషల్ మీడియా నుండి ఒక మూడు నెలలపాటు సెలవు తీసుకోవాలి అని ఆలోచనలు చేస్తున్నట్లు లీకులు ఇచ్చాడు జూనియర్. అయితే జూనియర్ తీసుకున్న ఈ సోషల్ మీడియా అజ్ఞాతవాసానికి స్పష్టమైన కారణాలు తెలియకపోయినా ఇంత హఠాత్తుగా జూనియర్ కు సోషల్ మీడియా పై విరక్తి ఎందుకు కలిగింది అంటూ ఆ సెల్ ఫోన్ సంస్థ మీడియా మీట్ కు వచ్చిన మీడియా ప్రతినిధులు తమలో తాము కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: