తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ‘ఎన్టీఆర్’ బయోపిక్. గత కొంత కాలంగా టాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం కొనసాగుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు అలనాటి మహానటి జీవితం గురించి కూడా అర్ధం అయ్యేలా సినిమా తెరకెక్కించారు.
మొదట సావిత్రి జీవితంలో విషాదాలు చూపిస్తారని రక రకాల రూమర్లు వచ్చినా..మహానటి చిత్రం చూసిన తర్వాత చాలా మందికి ఆమే జీవితం గురించి క్లారిటీ వచ్చింది. మహానటి జీవితంలో ఎన్ని వొడిదుడుకులు వచ్చాయో అన్నది కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకులు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఎన్టీఆర్ సినీ కెరీర్, రాజకీయ జీవితం అన్ని రకాలుగా చూపించబోతున్నట్లు సమాచారం.
క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ని ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను, మోహన్ బాబును ఎంపిక చేశారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో రకూల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తుంది. అయితే రకూల్ ఏ పాత్రలో కనిపించబోతుందని మొన్నటి వరకు చర్చలు జరిగాయి.
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో రకూల్ ప్రీత్ సింగ్ అందాల నటి అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించబోతుంది. ఎన్టీఆర్ సీనీ కెరీర్ లో ఎక్కువ చిత్రాలు సావిత్రి, శ్రీదేవిలతో నటించిన విషయం తెలిసిందే.. అందుకే ఆ పాత్రలకు ఎంతో ప్రాధాన్య ఇస్తున్నట్లు తెలుస్తుంది. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.