టాలీవుడ్ లో ‘జెంటిల్ మెన్’ చిత్రంతో పరిచయం అయిన  నివేదా థామస్ ఆ తర్వాత ‘నిన్నుకోరి’ చిత్రంలో నటించారు. ఈ రెండు  చిత్రాల్లో హీరో నాని కావడం విశేషం. అంతే కాదు రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రంతో ఎంతో మంది తెలుగు అభిమానులను సంపాధించుకున్నారు నివేదా. ‘నిన్నుకోరి’చిత్రం మంచి గుర్తింపు రావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’చిత్రంలో అవకాశం దక్కించుకుని.. ఆ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసింది.
Image result for niveda thomas
ప్రస్తుతం తన చదువు పూర్తి చేసుకోవడానికి  చిత్రాలకు దూరంగా ఉంటూ వచ్చింది. చదువును పూర్తిచేసేసిన ఆమె .. తాజాగా కల్యాణ్ రామ్ జోడీగా ఒక చిత్రంలో నటిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఆమె కాసేపు మాట్లాడింది. ఈ సందర్బంగా ఓ అభిమాని మీ నంబర్ ఇస్తారా..? అని అడగగా.. నిర్మోహమాటంగా ఇవ్వలేనంటూ చెప్పేసింది.
Image result for niveda thomas
ఇదే క్రమంలో టాలీవుడ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ అని అడిగితే.. నాని అని చెప్పేసింది. విభిన్నమైన కథా చిత్రాల్లో నటించడం .. ప్రేక్షకులను మెప్పించడం నాకు ఇష్టం. నేను నటించిన చిత్రాలను థియేటర్లోనే చూస్తాను .. ప్రేక్షకులతో కలిసి చూడటానికే ఎక్కువగా ఇష్టపడతాను .. అందులోనే అసలైన మజా ఉంటుందని అంటున్నారు నివేదా థామస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: