మోహన్ బాబు నట వారసురాలుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తన తండ్రిలాగే ఏవిషయం పై అయినా ఎటువంటి మొహమాటం లేకుండా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆమెకు నటిగా మంచి పేరు వచ్చినా ఆమె నటించిన సినిమాలు ఏమాత్రం విజయవంతం కాకపోతున్న నేపధ్యంలో లేటెస్ట్ గా విడుదల అవుతున్న ‘వైఫ్ ఆఫ్ రామ్' అయినా తాను కోరుకున్న సక్సస్ ను ఇస్తుందేమో అన్న ఆశతో ఆమూవీని తెగ ప్రమోట్ చేస్తూ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. 
తెలుగులో ఇలాంటి సినిమాలు అరుదు
ఒక సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ గా రూపొందిన ఈమూవీ కథ ఒక హత్య చుట్టూ తిరుగుతుంది. ఒక ఎన్.జి.వో. సంస్థలో పనిచేసే దీక్ష అనే పాత్రలో మంచు లక్ష్మి నటిస్తోంది. తన భర్త హత్యకు సంబంధించిన రహస్యాలను బయటపెట్టే పాత్రలో మంచు లక్ష్మి బాగా చేసింది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. 
చాలా టైటిల్స్ అనుకున్నాం
రేపు విడుదలకాబోతున్న ఈమూవీ గురించి మంచు లక్ష్మి ఇది ఒక టిపికల్ సినిమా అంటూ  ఒక ఆర్డినరీ ఫ్యామిలీకి చెందిన వైఫ్ జర్నీ ఈసినిమాలో కనిపిస్తుంది అంటూ ఈసినిమా కథకు ‘కహానీ' మూవీకి ఎటువంటి సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇదే సందర్భంలో ఆ మీడియా సంస్థ ప్రతినిధి తన ప్రశ్నలో నటిగా మంచి పేరొస్తుంది కానీ కమర్షియల్‌గా సక్సెస్ అందుకోవడంలేదు కారణాలు ఏమిటి ? అనే ప్రశ్నకు మంచు లక్ష్మి సమాధానం ఇస్తూ కోటి రూపాయలు పెట్టి పది కోట్లు వచ్చే సినిమాలైతే తాను ఇంకా చేయలేదని ఒకోసారి సినిమాలు వదిలేయాలి అని ఆలోచన వచ్చినా తాను ఇంట్లో కూర్చుని ఏమిచేయాలి అంటూ ఆలోచన రావడంతో తన రిటైర్ మెంట్ ఆలోచనలు మారిపోతున్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 సినిమాలోని పాత్రల గురించి
అయితే ఇదే సందర్భంలో మంచు లక్ష్మి టివీ షోల గురించి మాట్లాడుతూ టీవీ షోలు చేయడంకంటే సినిమాలు చేయడం సులువు అని అంటూ టీవీ షోలు చేస్తున్నప్పుడు దూల తీరిపోతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు సినిమా షూటింగ్ లో పది తప్పులు జరిగితే టివీ షోల షూటింగ్ లో వంద తప్పులు జరుగుతాయి అని అంటూ అవి అన్నీ సరిచేసుకుంటూ ఆ షోను పూర్తి చేసుకునే సరికి నరకం కనిపిస్తుంది అంటూ బుల్లితెర కార్యక్రమాల పై తన అభిప్రాయంతో కూడిన అసహనాన్ని బయటపెట్టింది ఈ మంచువారి అమ్మాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: