ఏవిషయం పై అయినా నిర్మొహమాటంగా మాట్లాడే మంచులక్ష్మి తాను మోసపోయాను అంటూ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టింది. నిన్నవిడుదలైన తన మూవీ ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ లక్ష్మి ఈఆసక్తికర కామెంట్స్ చేసింది. విభిన్నమైన సినిమాలను నిర్మించి నిర్మాతగా దర్శకురాలిగా అనేక అవార్డులు అందుకున్న ఈమెకు ప్రస్తుతం అనేక ఆర్ధికసమస్యలు ఉన్నాయని చెపుతోంది. 
మనశ్శాంతిగా పడుకుని సంవత్సరాలైంది
తాను గతంలో తీసిన ‘గుండెల్లో గోదావరి’ ఫ్లాప్ కావడంతో ఆమూవీ నిర్మాణ సమయంలో చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీలు తాను ఇంకా కడుతున్నాను అన్న విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం తనకు ఉన్న అప్పులు వల్ల ఒకొక్కసారి తనకు నిద్ర కూడ పట్టడం లేదనీ ఈవిషయాలను బయటకు చెపితే ఎవరూ నమ్మరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ సినిమా తనను ఎప్పుడూ మోసం చేయలేదని మనుషులు మోసం చేయడం వల్ల తాను నష్టపోయాను అంటూ ‘వైఫ్ ఆఫ్ రామ్’ విజయం సాధించి తన అప్పులన్నీ తీరాలని కోరుకుంటున్నానని తన మనసులోని మాటను బయటపెట్టింది. 
మనుషులు మోసం చేశారు
అదేవిధంగా ‘మేము సైతం' షో చాలామందికి ఉపయోగపడిందని ఆ షోలో పాల్గొన్న వారి కష్టాలువిని ఆబాధను తనలో నింపుకుని తాను మానసికంగా పడినకష్టాలను వివరిస్తూ తాను ఇలా బాధపడటం తన తండ్రి మోహన్ బాబుకు నచ్చకపోవడంవల్ల తనను ఆషో చేయవద్దని మోహన్ బాబు చెప్పిన విషయాన్ని గుర్తుకుకు తెచ్చుకుంది. 
ఇదే సందర్భంలో మంచు లక్ష్మి మరో ట్విస్ట్ ఇచ్చింది. తనకు డబ్బులు ఇవ్వాల్సినవారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని తనకు బకాయిపడ్డ కొందరు వ్యక్తులు ప్రస్తుతం నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్న విషయాన్ని లీక్ చేసింది.
 మోహన్ బాబు కూతురు అనే పొగరు వల్లే
మోహన్ బాబు కూతురును ఎవరు మోసం చేస్తారని అనుకోవడం వల్లే చాలామంది తనను సులభంగా మోసం చేశారని అంటూ తనను ఎవరైనా ఏమైనా అంటే తన్నడానికి ముగ్గురున్నారని  కానీ తన్నడాన్ని కూడా మీడియా రకరకాలుగా చూపిస్తోందని అంటూ మీడియా పై తన అసహనాన్ని వ్యక్త పరిచింది. ప్రస్తుతం సినిమాలు చేయడంకన్నా వ్యాపారాలు చేసుకోవడం మంచిది అన్న ఉద్దేశ్యంతో ప్రస్తుతం హోటల్ బిజినెస్ లోకి దిగానని చెపుతున్న మంచు లక్ష్మిని ఈహోటల్ బిజినెస్ అయినా మోసం చేయకుండా సక్సస్ ఇవ్వాలని కోరుకుందాం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: