తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు వారసులుగా మంచు విష్ణు, మనోజ్ లతో పాటు మంచు లక్ష్మి కూడా ఎంట్రీ ఇచ్చారు. అనగనగా ఓ ధీరుడు చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తర్వాత విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. అంతే కాదు కొన్ని లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న న w/o రామ్ సినిమా రిలీజ్ అయి మిశ్రమ స్పందన వచ్చింది. `ఐరేంద్రి` పాత్రతో తెరంగేట్రం చేసిన మంచు లక్ష్మి ...ఆ తర్వాత నటిగా - నిర్మాతగా - దర్శకురాలిగా తన సత్తా చాటుతుంది.
నటిగానే కాకుండా `మేము సైతం` వంటి కార్యక్రమాలతో సమాజ సేవ కూడా చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ..ఇండస్ట్రీలో చిత్రాలతో తాను ఎప్పుడూ మోసపోలేదని.. త మనుషులు మోసం చేయడం వల్ల నష్టపోయానని చెప్పింది. గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించానని ఆ సమయంలో చేసిన అప్పులు ఇప్పటికీ తీరలేదని తెలిపింది. `వైఫ్ ఆఫ్ రామ్` విజయం సాధించి ....తన అప్పులన్నీ తీరాలని ఆకాంక్షించింది.
గతంలో ‘గుండెల్లో గోదారి' సినిమాతో అప్పులపాలయ్యానని వాటిని ఇప్పటికీ తీరుస్తూనే ఉన్నానని చెప్పింది. తాను తీసుకున్న ప్రతి రూపాయి తిరిగి ఇస్తానని - అప్పుల వల్లే మనశ్శాంతిగా నిద్రపోలేకపోతున్నానని చెప్పింది. మోహన్ బాబు గారి కూతురును ఎవరు మోసం చేస్తారని అనుకోవడం వల్లే చాలా మంది తనను సులభంగా మోసం చేశారని తెలిపింది. తనను ఏమైనా అంటే తన్నడానికి ముగ్గురున్నారని - కానీ తన్నడాన్ని కూడా మీడియా రకరకాలుగా చూపిస్తోందని చెప్పింది.
అయితా తాను బుల్లితెరపై నిర్వహిస్తున్న ‘మేము సైతం’ అనే షో చాలామందికి ఉపయోగపడిందని దాని వల్ల ఎంతో మంది కుటుంబాలతో సంతోషంగా ఉన్నారని అయితే వారి ఆవేదన, కష్టాలు విని కొంత సమయం వరకు నాలో బాధ వర్ణనాతీతంగా ఉండేదని అది గమనించి మా నాన్నకు అస్సలు నచ్చేలేదట..అదుకే ఆ షో ఆపేశామని చెప్పారు. ప్రస్తుతం సినిమాలతోపాటు వ్యాపారం చేయాలని....ప్రస్తుతం జూనియర్ కుప్పన్న హోటల్ బిజినెస్ లోకి దిగానని చెప్పింది.