యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘సాక్ష్యం’ కు ఊహించని విధంగా సెన్సార్ సమస్యలు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వచ్చే వారం విడుదల తేది ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకు ఎటువంటి పోటీ లేకుండా సోలో రిలీజ్ డేట్ కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఇక విడుదల తేది దగ్గర అవుతున్న నేపధ్యంలో ఈమూవీ సెన్సార్ కార్యక్రమాల కోసం సెన్సార్ మెట్లు ఎక్కినప్పుడు ఊహించని విధంగా చిక్కుల్లో పడటం హాట్ టాపిక్ గా మారింది.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈనెల 27న విడుదల కావాల్సిన ఈమూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు అని తెలుస్తోంది. ఈ విషయమై ప్రస్తుతం లీక్ అవుతున్న సమాచారం మేరకు ఈమూవీ కథ రీత్యా ‘సాక్ష్యం’ సినిమాలో కొన్ని జంతువులు పక్షుల్ని వాడటం జరిగింది అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ అనుమతులు వాటికి సంబంధించిన ఎన్ఓసీలు తీసుకురాలేదని టాక్.
ఈకారణాలను చూపుతూ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో మరో రెండు రోజులలో సంబంధింత అధికారుల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ అందించడంలో జాప్యం జరిగితే ఈమూవీ వచ్చే వారం విడుదల కష్టం అని అంటున్నారు.
దీనికితోడు ప్రస్తుతం దేశంలో జంతు సంరక్షణ చట్టాలు చాలా కఠినంగా ఉన్న నేపధ్యంలో జంతుపులు, పక్షుల్ని పెట్టి సినిమాలు తీయాలి అంటే ముందుగానే అనుమతులు తీసుకోవడం తప్పని సరి అవుతుంది. వాస్తవానికి పంచభూతాల కాన్సెప్ట్ కథతో వస్తున్న ‘సాక్ష్యం’ సినిమా విషయంలో ఈ సినిమా యూనిట్ ముందుగా ఎందుకు అనుమతులు తీసుకోలేదో సమాధానం లేని ప్రశ్నగా మారింది..