ప్రస్తుతం నాగచైతన్య విజయ్ దేవరకొండల మధ్య నడుస్తున్న రివర్స్ గేమ్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. వాస్తవానికి నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమా ముందుగా విడుదల కావాలి. అదేవిధంగా విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాల’ కూడ ముందుగా ఈనెలలోనే విడుదల కావాలి. 
Vijay Devarakonda
అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ రెండు సినిమాలు పక్కకు వెళ్ళి వీరిద్దరూ నటించిన మరో రెండు సినిమాలు ముందుకు రావడం అత్యంత ఆసక్తిగా మారింది. త్వరలో విడుదల కాబోతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ ‘గీతాగోవిందం’ మూవీల రిజల్ట్ పై ప్రస్తుతం వెనక్కి నెట్టబడ్డ ‘సవ్యసాచి’ ‘టాక్సీవాల’ సినిమాల భవిష్యత్ ఆధారపడి ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 
 Naga Chaitanya
ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ విషయానికొస్తే పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా ‘టాక్సీవాలా’ లేట్ అవుతోందని అన్కుంటూ వచ్చారు. అయితే అసలు కారణాలు వేరు అని అంటున్నారు. ఈమూవీ నిర్మాత అల్లు అరవింద్ కు ‘టాక్సీవాలా’ అవుట్ పుట్ పూర్తిగా నచ్చకపోవడంతో ఆఖరి నిమిషంలో ‘టాక్సీవాలా’ ను పక్కకునెట్టి ‘గీతగోవిందం’ ను తెరపైకి తీసుకొచ్చారు. ‘గీతగోవిందం’ హిట్ అయితే అదే ఊపులో మినిమం గ్యాప్ లో ‘టాక్సీవాలా’ ను విడుదల చేసేస్తారు. లేదంటే మళ్లీ రిపేర్లు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Naga Chaitanya,Savyasachi,Chandoo Mondeti
అదేవిధంగా ‘సవ్యసాచి’ విషయంలో కూడ ఇదే పరిస్థితి అని అంటున్నారు. నాగార్జున ఈ సినిమాను చూసి పెదవి విరవడంతో ‘సవ్యసాచి’ వెనక్కు వెళ్లి ‘శైలజారెడ్డి అల్లుడు’ ముందుకు వచ్చింది.  ‘యుద్ధం శరణం’ లాంటి డిజాస్టర్ తర్వాత మరోసారి సవ్యసాచి లాంటి యాక్షన్ సినిమాను రిలీజ్ చేసే కంటే ‘శైలజా రెడ్డి అల్లుడు లాంటి’ మసాలా సినిమాను విడుదల చేస్తే చైతన్య మార్కెట్ పెరుగుతుందని నాగార్జున అభిప్రాయం అని టాక్. ఇలా ప్రస్తుతం ఈహీరోలు ఇద్దరూ ఆడుతున్న రివర్స్ గేమ్ చైతన్య విజయ్ దేవరకొందలకు ఎంత వరుకు అదృష్టాన్ని ఇస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: