‘బిగ్ బాస్’ హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన  తేజస్వి తనపై వస్తున్న ఆరోపణలపై ఫేస్‌ బుక్ లైవ్‌ లో స్పందించింది. తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ కు ధీటుగా సమాధానాలు ఇచ్చింది.  ‘బిగ్ బాస్’ హోస్ లో జరిగే అసలు విషయాలు బయట వ్యక్తులకు తెలియవని కేవలం బుల్లితెర పై ప్రసారం అవుతున్న  కొన్ని సన్నివేశాలను చూసి అభిప్రాయాలను ఏర్పరుచుకుని జనం ఓటింగ్ చేస్తున్నారు అంటూ గగ్గోలు పెడుతోంది తేజస్వి.
కౌశల్‌తో వార్ లేదు..
వాస్తవానికి ఎవరైనా ‘బిగ్‌ బాస్’ ఇంట్లోకి వచ్చి కౌశల్‌ ప్రవర్తనను చూస్తే వారు కౌశల్ ను కొడతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు కౌశల్ అర్థరాత్రి లేచి భోజనం చేస్తుంటాడని అందువల్ల ‘బిగ్ బాస్’ హౌస్ మేట్స్ ఎవరికీ తిండి సరిపోవడం లేదు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది తేజస్వి. తాను మాటల్లో కౌశల్ కు ప్రేమను పంచితే అవన్నీ చూపించకుండా కేవలం తాను అన్న నెగిటివ్ మాటలను మాత్రమే చూపించి తనకు అన్యాయం చెసరు అంటోంది తేజస్వి.
కౌశల్‌ను మీరే కొడ్తారు..
తన ఏడుపులు పక్కన పెడితే తను ఏమిటో అర్ధమవుతుంది అంటూ 24 గంటల బిగ్ బాస్ జర్నిలో కేవలం తన పై చూపించిన 10 నిముషాల విషయాలను ఆధారంగా తీసుకుని తనను  చాలామంది బ్యాడ్ చేసారు అని గగ్గోలు పెడుతోంది. ఇదే సందర్భంలో ఆమె తన భావాలను పంచుకుంటూ తాను మళ్ళీ ‘బిగ్ బాస్’ ఇంట్లోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నానని దీనికి బుల్లితెర ప్రేక్షకుల సపోర్ట్ కావాలి అంటూ కామెంట్స్ చేసింది. 
నన్ను చూపించింది 10 నిమిషాలే
అయితే ఈ ఫేస్ బుక్ లైవ్ ఛాట్ లో పాల్గొన్న నెటిజన్లు మాత్రం తాము తేజస్వి రీ ఎంట్రీ తట్టుకొలేమనీ తాము తమ కుటుంబంతో కలిసి ‘బిగ్ బాస్’ షోను తేజస్వి వల్ల చూడలేకపోతున్నామని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈవిషయాలను పట్టించుకోకుండా స్టార్ మా టీమ్ మరో మార్గం ద్వారా తేజస్విని ‘బిగ్ బాస్’ హోసే లోకి తిరిగి ఎంటర్ చేసే విషయమై తీవ్ర ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: