ఎప్పుడు నవ్వుతు ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ గత కొద్దిరోజులుగా తన యూనిట్ సభ్యుల పై తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఎప్పుడు నవ్వుతు ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ గత కొద్దిరోజులుగా తన యూనిట్ సభ్యుల పై తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ‘అరవింద సమేత’ కు రిలీజ్ డేట్ ఫిక్స్ అయినా ఇంకా ఆసినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా చాల పెండింగ్ లో ఉండటం అని అంటున్నారు.
‘అరవింద సమేత’ ను దసరాను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 11న విడుదల చేయబోతున్న నేపధ్యంలో ఈ సినిమా షూటింగ్ ఇంకా 60రోజుల వరకు మిగిలి ఉంది అని టాక్. జూలై పూర్తి అవుతున్న నేపధ్యంలో ఇక ఆగస్టు, సెప్టెంబర్ మాత్రమే మిగిలి ఉన్న పరిస్థుతులలో ఒకవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరొక వైపు ఎడిటింగ్ డబ్బింగ్ రీ రికార్డింగ్ డిటీఎస్ మిక్సింగ్ గ్రాఫిక్స్ అన్నీ సమాంతరంగా జరగాలి కాబట్టి ఇవన్నీ జరిగే పనేనా అని లోలోపల త్రివిక్రమ్ టెన్షన్ పడుతున్నట్లు టాక్.
ఈ పనుల వేగంమధ్య ఈసినిమా ఎడిటింగ్ విషయంలో ఏమైనా పొరపాట్లు జరుగుతాయా అన్న భయాలు కూడ త్రివిక్రమ్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ‘అరవింద సమేత’ గురించి వస్తున్న లీకులు. లేటెస్ట్ గా ఈమూవీకి సంబంధించి కారులో గాయాలతో ఉన్న జూనియర్ నాగబాబుల ఫోటో లీక్ అయిన విషయం పై త్రివిక్రమ్ చాల సీరియస్ అయినట్లుతెలుస్తోంది. దీనితో షూటింగ్ స్పాట్ కు ఎవరూ సెల్ ఫాన్స్ ను తీసుకు రావద్దని త్రివిక్రమ్ చాల గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తో తన ఇమేజ్ ని పోగొట్టుకున్న త్రివిక్రమ్ అనుకోకుండా ‘అరవింద సమేత’ ను చుట్టుముట్టుతున్న సమస్యల పై చాల అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో షూటింగ్ స్పాట్ లో తన సహజ సిద్ధమైన నవ్వును దూరం చేసుకుని షూటింగ్ యూనిట్ ను అంతా అష్టదిగ్బబంధంలో బందిస్తూ ఈమూవీ పని పై తన ఫోకస్ పెంచాడు అన్న వార్తలు వస్తున్నాయి..