తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా టాప్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల చిత్రాలు ఒకే సమయంలో రిలీజ్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో సంక్రాంతి అంటే అటు టాలీవుడ్ కి..ఇటు ప్రేక్షకులకు సినీ పండుగనే చెప్పాలి. ఎందుకంటే స్టార్ హీరోల చిత్రాలు సంక్రాంతి కి రిలీజ్ చేయడం సెంటిమెంట్ గా వస్తుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, నాగార్జున, రాంచరణ్,ఎన్టీఆర్ ఇలా చాలా మంది హీరోలకు సంక్రాంతి ఒక సెంటిమెంట్ అని చెబుతుంటారు. ఒక్క సంక్రాంతి మాత్రమే కాదు దసరా, దీపావళి కూడా కొంత మంది హీరోలకు సెంటిమెంట్.
ఇక ఈ మద్య చిన్న చిత్రాల జోరు బాగా నడుస్తుంది. ఒకే సమయంలో రెండు, మూడు ఒక్కోసారి ఇతర భాషా చిత్రాలతో నాలుగైదు చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఆ మద్య ఏకంగా ఏడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మనోడి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘గీతాగోవిందం’ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ సరసన ఛలో ఫేం హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్, టీజర్ బాగానే ఆకట్టుకున్నాయి.
శతమానం భవతి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దిల్ రాజు సతీష్ వేగేశ్న ల కాంబినేషన్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఆగస్టు లో రిలీజ్ కాబోతున్నాయి. తాజాగా నితిన్, విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు ఏ మేరకు ప్రేక్షకులను ఆకర్షిస్తాయి..ఏ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుంది అనేది తెలియాలి. మరోవైపు ఈ రెండు చిత్రాల ప్రొడ్యూసర్లు కూడా ఆ విషయంలో ధీమాగానే మాట్లాడుతున్నారు.