తెలుగు బుల్లితెరపై నేచురల్ స్టార్ నానీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 మొదట్లో కొన్ని విమర్శలు వచ్చినా ..నాలుగు వారాల నుంచి ఇంట్రెస్ట్ పెంచుతూ వస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్ నుంచి సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వి లు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఈ ఎలిమినేట్ అయిన వారిలో ఎవరినో ఒకరిని మళ్లీ బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకోబోతున్నారు. కాకపోతే వీరిని ఓటింగ్ పద్దతిలో తీసుకోబోతున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లో ఆట ఎవరు బాగా ఆడుతుంటే వాళ్లని ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు .. ఈ విషయంలో వాళ్లు చాలా ఓపెన్ గా వున్నారు. ఆ రోజున బిగ్ బాస్ నా ఎలిమినేషన్ ను తీసుకెళ్లి కంటెస్టెంట్స్ చేతిలో ఎందుకుపెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఏది ఏమైనా అక్కడ ప్రతి ఒక్క కంటెస్టంట్ తమ పద్దతిలో గేమ్ ఆడుతూ వస్తున్నారు.
కాకపోతే కొన్ని సార్లు మాత్రం సహనం కోల్పోతున్నారని అన్నారు శ్యామల. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వున్న వాళ్లలో చివరి వరకూ నిలబడేవాళ్లుగా గీతామాధురి .. కౌశల్ కనిపిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు విజేతగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. బిగ్ బాస్ లో వీరిద్దరిని ఎంత మంది టార్గెట్ చేసినా..వాళ్లు తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుంటారు .. అందుకే వాళ్లిద్దరిలో ఒకరు విజేతగా నిలవచ్చని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.