ఒకప్పుడు ఎన్టీఆర్ ఎఎన్ఆర్ అనే ఇద్దరు వ్యక్తులు బ్రాండ్స్ గా మారి తమఇంటి పేర్లను తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా స్థానాన్ని సంపాదించారు. అయితే ఇప్పుడు అదేమార్గంలో ముగ్గురు టాప్ హీరోలు కలిసి ‘ఎమ్ ఎన్ ఆర్’ అన్న కొత్త బ్రాండ్ కు నాంది పలకబోతున్నారు. మహేష్ లోని ‘ఎమ్’ జూనియర్ ఎన్టీఆర్ లో ‘ఎన్’ రామ్ చరణ్ లోని ‘ఆర్’ అక్షరాలను కలిపి ‘ఎమ్ ఎన్ ఆర్’ అన్న కొత్త పిలుపుకు మహేష్ జూనియర్ చరణ్ లు తమ మైత్రి బంధంతో కొత్త బ్రాండ్ కు శ్రీకారం చుట్టారు అన్నమాటలు వినిపిస్తున్నాయి.
ఈఅరుదైన ముగ్గురి కలయిక మళ్ళీ వంశీ పైడిపల్లి 40వ పుట్టినరోజు వేడుకలలో జరిగింది. వంశీ పైడి పల్లితో వీరి ముగ్గురుకీ ఉన్న సాన్నిహిత్యంతో వీరంతా తమతమ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా వంశీ పైడిపల్లి కోసం అతడికి ఇంటికి రావడమే కాకుండా అక్కడ వీరంతా కలిసి ఫోటోలు తీయించుకుని వీరి మైత్రీ బంధాన్ని చాటారు.
మహేష్ జూనియర్ చరణ్ ల మధ్య స్నేహం పెరగడమే కాకుండా మహేష్ చరణ్ జూనియర్ ల భార్యల మధ్య పెరుగుతున్న మైత్రి కూడ ఈకొత్త ‘ఎమ్ ఎన్ ఆర్’ కు సహకరిస్తోంది అంటూ మరి కొందరి కామెంట్స్. టాప్ హీరోల మధ్య అవగాహన లేకుంటే ఈవిపరీతమైన పోటీ వాతావరణంలో నిలదోక్కుకోలేము అన్న ఉద్దేశ్యంతో వీరి మైత్రికి ఈ ‘ఎమ్ ఎన్ ఆర్’ బ్రాండ్ సహకరిస్తోంది అంటూ మరికొందరి విశ్లేషకుల అభిప్రాయం.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం వంశీ పైడిపల్లి మహేష్ తో నిర్మిస్తున్న మూవీ రైతుల సమస్యల నేపధ్యంలో కథ ఉంటుంది అన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. స్నేహం-ఫ్యామిలీ ఎమోషన్స్-రివెంజ్ డ్రామాని ఒక కథగా మార్చి వంశీ పైడిపల్లి మహేష్ కు మరో సూపర్ హిట్ అందివ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈసినిమా టైటిల్ విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది అని వార్తలు వస్తున్నాయి. దీనితో వచ్చేనెల ఆగష్టు 9న రాబోతున్న మహేష్ పుట్టినరోజునాడు ఈమూవీ టైటిల్ ను ఫస్ట్ లుక్ తో ప్రకటిస్తారు అన్న వార్తలు వస్తున్నాయి. మహేష్ జూనియర్ చరణ్ ల మధ్య స్నేహం బాగా పెరిగింది కాబట్టి వంశీ పైడిపల్లి మహేష్ మూవీ టైటిల్ విషయంలో వస్తున్న సమస్యలకు జూనియర్ చరణ్ ల సలహాలను కూడ తీసుకుంటాడేమో చూడాలి..