తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు మనవడు..నాగార్జున మేనళ్లుడు సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు శుభాంత్ నటించిన చిత్రాలు ఏదీ పెద్ద హిట్ కాలేదు. వెండితెరపై అప్పుడప్పుడు కనిపిస్తూ..తన కెరీర్ ని కొనసాగిస్తున్నాడు సుశాంత్. కాకపోతే బ్యాగ్ గ్రౌండ్ ఇమేజ్ కాస్త గట్టిగా ఉండటంతో..హీరోగా రానిస్తున్నాడు. తాజాగా సుశాంత్, రుహాణి శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం చిలసౌ. రాహుల్ రవీంద్రన్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక చిత్రం కథ విషయానికివస్తే.. హీరో సుశాంత్ పెళ్లి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సుశాంత్, రుహానీలపై ట్రైలర్ మొదలవుతుంది.పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో అని ఎన్ని సార్లు అడుక్కోవాలని సుశాంత్ తల్లి ఆగ్రహం.. నచ్చజెప్పడం అన్నీ చాలా అందంగా తెరకెక్కించారు డైరెక్టర్ రాహుల్. ‘హైదరాబాద్లో ఉండే హ్యాండ్సమ్ అబ్బాయిల్ని ఏమంటారో తెలుసా? టూరిస్ట్’’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్స్ యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఈ చిత్రం ఆగష్టు 3 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఆఫీషియల్గా ప్రకటించింది చిత్ర బృందం.
ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రోహిణి, అనుహాసన్లు ఇతర పాత్రధారులు. భారత్ కుమార్ మాలాసల, హరి పులిజల, జస్వంత్ నదిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియెస్, సిరునీ సినీ కార్పోరేషన్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యింది. నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.