అల్లరోడిగా బాక్స్ ఆఫీసును షేక్ చేస్తూ ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా వరస హిట్స్ అందించిన అల్లరి నరేశ్ పరిస్థితి ప్రస్తుతం తీవ్ర అయోమయంలో ఉంది. వరస పరాజయాలతో సతమతమవుతున్న ఈ హీరోతో సినిమాలు చేయడానికి హీరోయిన్స్ కూడ దొరకడం లేదు అంటే ఇతడి పరిస్థితి ఎంత అయోమయంలో ఉందో అర్ధం అవుతుంది. 

ఇలాంటి పరిస్థితులలో అల్లరి నరేశ్ కు తిరిగి బ్రేక్ ఇవ్వడానికి దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు అల్లరి నరేశ్ సునీల్ లను కలిపి తీస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘సిల్లీ ఫెలోస్’ ఎట్టకేలకు తన షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈమూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి త్వరలో విడుదల చేయాలని దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నాడు. 

ఈమూవీకి ఈమధ్య ‘నేనే రాజు నేనే మంత్రి’ ‘ఎమ్ఎల్ఎ’ లాంటి సినిమాలను నిర్మించిన నిర్మాతలు అండగా ఉండటంతో ఈమూవీకి మార్కెటింగ్ సమస్యలు తలెత్తవు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో నటించిన అల్లరి నరేశ్ కు కామెడీ హీరో సునీల్ తో సమానంగా పారితోషికం ఇచ్చారు అన్న వార్తలు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. 

సుమారు 50 సినిమాలకు పైగా హీరోగా నటించిన నరేశ్ కు సునీల్ తో సరిసమానంగా కేవలం 1 కోటి 25 లక్షలు పారితోషికం ఇచ్చారు అని వార్తలు వస్తూ ఉండటంతో నరేశ్ రేంజ్ సునీల్ తో సమానం అయిపోయిందా  అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈసినిమాలో సునీల్ కు నరేశ్ తో సరిసమానంగా పాత్రను క్రియేట్ చేయడం అల్లరోడికి ఊహించని షాక్ ఇచ్చిందని సమాచారం. ఈసినిమా షూటింగ్ సమయంలో పైకి నరేశ్ సునీల్ తో చాల సాన్నిహిత్యంగా కనిపించినా జరిగిన అవమానానికి లోలోపల చాల రగిలిపోయినట్లు టాక్. ముగ్గురు ఫెయిల్యూర్ వ్యక్తులు భీమిమేని నరేశ్ సునీల్ కలిసి చేసిన ఈ ప్రయోగం కూడ సక్సస్ కాకపోతే ఇక వీరిని రక్షించడం ఎవరి వల్ల కాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: