‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న మూవీ కేవలం మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా కాకుండా ఒక డిఫరెంట్ కథతో తీస్తున్నారు. ఈమూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతూ ఉన్నా ఈమూవీ నిర్మాణ విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు దర్శకుడు బోయపాటి నిర్మాత దానయ్య హీరో చరణ్ ల మధ్య ఏర్పడినట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి.
దీనితో ప్రస్తుతం నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ఈమూవీ మేకింగ్ విషయంలో ప్రభావితం చేస్తుందా అన్న అనుమానాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. ఈసినిమా కథరీత్యా అత్యంత భారీ ఖర్చుతో బోయపాటి చాలా పెద్ద స్టార్ క్యాస్ట్ ను ఫిక్స్ చేసాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు జరిగిన ఈమూవీ షెడ్యూల్స్ లో రోజుకు 25 లక్షల దాకా బోయపాటి అంత్యంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టాడట.
దీనికితోడు ఈసినిమాకు సంబంధించిన కీలక నటీనటుల డేట్స్ విషయంలో సమస్యలు ఏర్పడటంతో అనవసరంగా డబ్బు వృధా అయి ఈమూవీ బడ్జెట్ రోజురోజుకు పెరిగిపోవడం నిర్మాత దానయ్యకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. దీనితో ఈవిషయమై కొన్ని కీలక చర్చలు ఈమధ్య చరణ్ బోయపాటీల మధ్య జరగడంతో హర్ట్ అయిన బోయపాటి ఈమూవీ షూటింగ్ ను రెగ్యులర్ గా ఒక ఫ్లో ప్రకారం షూట్ చేయలేకపోతున్నాడని మధ్యలో గ్యాపులు వస్తున్నాయని అని అంటున్నారు.
చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ నెల 22న ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని ఈమూవీ టీమ్ గతంలోనే ప్రకటించినా ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈఫస్ట్ లుక్ విషయంలో అలాగే టైటిల్ విషయంలో వాయిదాల పర్వం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈవిషయాలు అన్నీ చిరంజీవి దృష్టి వరకు వెళ్ళడంతో మెగా స్టార్ చరణ్ బోయపాటి దానయ్యల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ కు చెక్ పెట్టే దిశలో అప్పుడే రాయబారాలు ప్రారంభించినట్లు టాక్..