డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి ప్రముఖ సినీ నటుడు ఎం.మోహన్బాబు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రాజకీయ భీష్మ పితామహుణ్ని కోల్పోయామని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని తెలిపారు. ఆయన కుటుంబంతో తమకు మంచి అనుబంధం ఉందని ఆయన తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నానని చెప్పారు.
తన సోదరులు స్టాలిన్, అళగిరి, ఇతర కుటుంబసభ్యులకు సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. కరుణానిధి రాజకీయ దిగ్గజమే కాదని... అద్భుతమైన రచయిత, వక్త అని మోహన్ బాబు కొనియాడారు. ఆయన మాటలు ఉద్వేగపరుస్తాయని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లక్షలాది జీవితాలకు మేలు చేశాయని, తన రచనలతో లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపారని కొనియాడారు.
తన గురువు దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీడ’, ‘బంగారక్క’ చిత్రాలకు స్వర్గీయ కరుణానిధి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. కరుణానిధి ఉత్తమ రాజకీయ నాయకుడు మాత్రమే కాదని అద్భుతమైన రచయిత, వక్త అని చెప్పారు. ఆయన మాటలు ఉద్వేగపరుస్తాయని అన్నారు. లక్షలాది మందిలో ఆశల్ని నింపారు. తన రచనలతో లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపారు’ అని మోహన్బాబు తన ట్వీట్లో పేర్కొన్నారు.