తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహబలి, బాహుబలి 2 చిత్రాలతో ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ఆ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఆ మద్య బిర్లా చిత్రంలో ప్రభాస్ ఇంటర్ నేషనల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాహూ చిత్రంలో కూడా ఇదే రీతిలో కనిపించబోతున్నాడట..కాక పోతే మాఫియా డాన్ గా కాకుండా ఇంటర్ నేషన్ దొంగగా అదరగొట్టబోతున్నాడట ప్రభాస్.
ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని చిటికెలో దాటేస్తాడట. ఇంటర్ పోల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేస్తాడట. సింపుల్ గా చెప్పాలంటే సాహూ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఇదిని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పలు దేశాల్లోనే పురాతన వజ్రాలు దొంగిలిస్తూ పోలీసులు కంట పడకుండా తిరుగుతుంటాడు. ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు అనేది చిత్రం చూస్తే కాని తెలియదు.
ప్రభాస్ ను పట్టుకోవడానికి ప్రయత్నించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరోయిన్ శ్రద్దా కపూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ దొంగా పోలీస్ ఆట ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం:శంకర్ ఎహాసన్ లాయ్.