తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఎస్ఎంఎస్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ బాబు బ్యాగ్ గ్రౌండ్ సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబులు ఉన్నప్పటికీ తన టాలెంట్ తో తనను తాను ప్రూఫ్ చేసుకుంటున్నాడు.  ప్రేమకథా చిత్రమ్ తర్వాత సరైన హిట్ లేని సుదీర్ బాబు కి ఈ మద్య నటించిన సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేశాడు.  తాజాగా సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’.


 ఈ చిత్రంలోని “మౌనం మాటతోటి”… అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.  అజనీష్ లోకనాథ్ సంగీతం అందించడంతో పాటు గాయకుడి గానూ మెప్పించాడు. ప్రముఖ రచయిత శ్రీ మణి సాహిత్యమందించారు. విజయ్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫి చేశారు. "మౌనం మాట తోటి ఊసులు ఏవో చెబుతోందా .. ముల్లే పూవు చెప్పే ఊహలన్నీ వింటుందా .. తెల్లని కాగితం .. రంగుల సంతకం .. కలిపిన కొత్త జాతకం .. రంగవల్లిలా మెరుపులద్దుకుందా" అంటూ ఈ సాంగ్ అందంగా సాగింది. 


ఇటీవ‌ల‌ చిత్ర ఫ‌స్ట్ లుక్ , టీజ‌ర్‌ విడుద‌లైంది.ఇది అభిమానుల‌ని అల‌రించింది. చిత్రంలో సుధీర్ బాబు కాస్త డిఫ‌రెంట్ మెంటాలిటీ ఉన్న మేనేజ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, హీరోయిన్ న‌బా న‌టేష్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా క‌నిపించనుంది. కీలక పాత్రల్లో నాజర్‌, వేణులు నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతమందిస్తున్నారు .


'భలే మంచి రోజు' .. 'సమ్మోహనం' చిత్రాలతో సక్సెస్ తో, సుధీర్ బాబు కి సక్సెస్ లు వరుసగా వస్తున్న తరుణంలో ‘నన్ను దోచుకుందువటే’ మంచి హిట్ అయితే మటుకు మనోడికి ఇండస్ట్రీలో కొంత కాలం ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని అంటున్నారు సినీ విశ్లేషకులు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వినాయ‌కచ‌వితి ప‌ర్వ‌దినాన సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయాటానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: