తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది నయనతార.  ‘చంద్రముఖి’చిత్రంలో రజినీకాంత్ సరసన నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత వచ్చిన గజినీ చిత్రంతో మరింత సక్సెస్ తెచ్చుకుంది. ఇక వరుసగా తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన నటించిన నయనతార ఇప్పటికీ తన కుర్రహీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది.  అంతే కాదు దక్షిణాది ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయన తార కావడం మరో విశేషం. 

ప్రస్తుతం నయనతార ఎక్కువ శాతం లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు.  అంతే కాదు గ్లామర్ పాత్రలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ..నటనపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.  ఈ నేపథ్యంలో ‘అరం’, ‘డోరా’, ‘మాయా’ వంటి చిత్రాల వరుసలో ఇప్పుడు మరికొన్ని చేరుతున్నాయి. ‘కోలమావు కోకిల’ త్వరలోనే విడుదల కానుంది. ‘కొలైయుదిర్‌ కాలం’ వంటి చిత్రాల్లో ఆమె కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘లక్ష్మి’, ‘మా’ వంటి లఘు చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన సర్జున్‌ దర్శకత్వంలోని  ఓ హర్రర్ కాన్సెప్ట్ చిత్రంలో నటించడానికి సిద్దమయ్యిందట నయన్.   

ఇందులోని దెయ్యం కోసం పెద్ద బంగ్లా సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.  బారీ బడ్జెట్ తో ఈ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది.   ఆ బంగ్లాలోకి వెళ్లి దెయ్యం ఉందా? లేదా? అని పరిశోధించే పాత్రను నయనతార పోషిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబరు తొలి వారంలో చిత్రీకరణ ఆరంభం కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: