‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘సాహో’.పై అత్యంత భారీ అంచనాలు ఉన్న నేపధ్యంతెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా  అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు ప్రతి న్యూస్ ఎప్పటికప్పుడు టాప్ ట్రెండింగ్‌ అవుతోంది. 
Prabhas in 'Saaho'.
 ప్రభాస్ కూడ తన అభిమానుల అంచనాలను అందుకునేందుకు ఈమూవీలో చాలతీవ్రంగా కష్టపడుతున్నాడని ఈ చిత్రయూనిట్ నుండి అనేక సందర్భాలలో లీకులు వస్తున్నాయి.  సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి  సంబంధించి ఎటువంటి లీకులు రాకుండా ఈమూవీ దర్శక నిర్మాతలు జగ్రత్తలు తీసుకుంటున్న నేపధ్యంలో  ఈసినిమా గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కావాలని  కొందరు ఈసినిమా పై రకరకాల గాసిప్పులు సృష్టిస్తున్నారు. 

లేటెస్ట్ గా ఈ చిత్రంలో ప్రభాస్ దొంగగా కనిపించనున్నాడని సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హడావిడి చేసింది. మరికొందరైతే ఈమూవీలో ప్రభాస్ ఒక వజ్రాల దొంగగా కనిపిస్తాడని ఊహాగానాలు కూడ చేసారు. ఇలా రకరకాల గాసిప్పులు ఈమూవీ కథ పై వస్తున్న నేపధ్యంలో ఈసినిమాకు సంబంధించి దర్శకత్వం వహిస్తున్న సుజిత్ ప్రభాస్ సలహాతో రాజమౌళి టెక్నిక్ ను అనుసరిస్తున్నట్లు టాక్. 
Prabhas is once again taking the risk performing risky stunts for Saaho
‘బాహుబలి’ సినిమా నిర్మాణంలో రాజమౌళి కట్టప్ప ‘బాహుబలి’ ని ఎందుకు చంపాడు అన్న విషయం ఆసినిమాలో నటిస్తున్న కీలక నటీనటులకు కూడ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్న విధంగా దర్శకుడు సుజీత్ ‘సాహో’ లో నటిస్తున్న కీలక నటీనటులకు కూడ ఈమూవీ కథ అర్ధం కాకుండా కేవలం వారు నటిస్తున్న సీన్ వరకే వివరించి ఈ సినిమా కథ విషయమై టాప్ సీక్రెట్ ను కొనసాగిస్తున్నట్లు టాక్. దీనితో రాజమౌళి ‘బాహుబలి’ టెక్నిక్ ను ‘సాహో’ విషయంలో ప్రభాస్ సుజిత్ లు అనుసరిస్తున్నారా అంటూ జోక్స్ కొందరు జోక్స్ కట్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: