జూనియర్ ఎన్టీఆర్ తన చిన్నతనంలో ఎన్నో కష్టాలను ఎదుర్కున్నాడు. అతడు ఈస్థాయిలో ఉన్నాడంటే అతడి తల్లి షాలినీయే కారణం అంటూ స్వయంగా జూనియర్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పాడు. తారక్ అభిరుచిని గమనించి చిన్నతనం నుండి అతడి తల్లి శాస్త్రీయ నృత్యం నటనలలో శిక్షణ ఇప్పించింది.  

జూనియర్ కూడ తన తల్లి పట్ల విపరీతమైన ఇష్టాన్ని వ్యక్త పరుస్తూ తనకు తన తల్లి తరువాత ఎవరైనా అంటూ ఆమె చేసిన త్యాగాలను వివరిస్తూ అనేక ఆడియో ఫంక్షన్స్ లో అనేక ఉపన్యాసాలలో వివరించాడు. అంతేకాదు తన అభిమానులను తమ తల్లితండ్రులను బాగా ప్రేమగా చూసుకోమని అనేక సందర్భాలలో జూనియర్ చెపుతూ ఉంటాడు.

ఈనేపధ్యంలో జూనియర్ తల్లి షాలిని పశ్చిమ గోదావరి జిల్లాలోని సీసిలి సాయిబాబా గుడిని దర్శించుకుని అక్కడ చేసిన విశేష పూజలు వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ జూనియర్ అభిమానులు తమ ఆతృతను ప్రదర్శిస్తున్నారు. జూనియర్ తల్లి సాయిబాబాకు హారతి ఇస్తోన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి తారక్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. 

ప్రస్తుతం జూనియర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటూ ఆమె ఈపూజలు చేసింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు ఈమధ్య జూనియర్ కు రెండవ కొడుకు పుట్టిన సందర్భంగా తన ఆనందాన్ని సాయి బాబాకు తెలియచేయడానికి ఇలా జూనియర్ తల్లి ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని సీసిలి సాయి బాబా గుడికి ఆమె వచ్చింది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘అరవింద సమేత’ తరువాత జూనియర్ నటించే మరో సినిమాను చూడాలి అంటే అభిమానులు రెండు సంవత్సరాలు ఆగవలసిన పరిస్థితి. రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మల్టీ స్టారర్ ఇంకా ప్రారంభం కూడ కాని నేపధ్యంలో 2019లో జూనియర్ సినిమాలే ఉండవు అందుకోసమే ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి జూనియర్ మ్యానియా కొనసాగాలని జూనియర్ తల్లి పూజలలోని  ఆంతర్యం అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: