ఈరోజు విడుదలైన ‘గీత గోవిందం’ మ్యానియాతో మన ఇరు రాష్ట్రాలలోని ధియేటర్స్ కిక్కిరిసి పోయి ఒక టాప్ హీరో సినిమా హడావిడిని తలపించింది. ఈరోజు నేషనల్ హాలిడే కావడంతో మంచి జోష్ మీద ఉన్న యూత్ ‘గీత గోవిందం’ టిక్కెట్స్ కోసం ప్రయత్నాలు చేయడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఈసినిమా చూసినవారు యూత్‌కు కిక్కెక్కించే మందులాంటిది అని ఫీల్ అవుతుంటే విజయ్ అభిమానులకు మాత్రం ఈమూవీ ‘అర్జున్ రెడ్డి’ కన్నా టాప్ హిట్ అన్న ప్రచారం చేస్తున్నారు. 
ఫస్టాఫ్ అనాలిసిస్
రేపు గురువారం వర్కింగ్ డే నాడు ఈమూవీకి వచ్చే కలక్షన్స్ ను బట్టి ఈమూవీ ఏరేంజ్ హిట్ అన్న విషయంలో ఒక స్పష్టమైన అవగాహన వచ్చే ఆస్కారం ఉంది. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమూవీ దర్శకుడు పరుశురామ్ ఈమూవీకి సంబంధించి హీరోయిన్ ఎంపిక విషయంలో తాము పట్ల పాట్లను వివరించాడు. 
సెకండాఫ్ అనాలిసిస్
ఈమూవీ ప్రారంభం సమయానికి ఇంకా ‘అర్జున్ రెడ్డి’ విడుదల కాకపోవడంతో విజయ్ మ్యానియా ఈస్థాయిలో లేకపోవడంతో చాలామంది హీరోయిన్స్ విజయ్ దేవరకొండతో నటించడానికి తిరస్కరించిన విషయాన్ని పరుశురామ్ బయటపెట్టాడు. దాదాపు 25మంది హీరోయిన్లను సంప్రదించినా ఓకే కాని సందర్భాన్ని వివరిస్తూ చివరకు రష్మిక మందానా ‘గీతాగోవిందం’ లో హీరోయిన్  పాత్ర చేయడానికి ఒప్పుకావడంతో ఆమె ఈకథ కోసమే పుట్టిందా అన్న ఫీలింగ్ తనకు కలిగిందని పరుశురామ్ ఆ ఇంటర్వ్యూలో వివరించాడు. 
కథలో మలుపులు
ఈరోజు విడుదలైన ఈమూవీలో విజయ్ రష్మికల లవ్ కెమెస్ట్రీ అదుర్సు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈహిట్ విజయ్ దేవరకొండకు కలిగే ఆనందంకంటే ఇప్పటి వరకు సరైన హిట్ చూడని పరుశురామ్ కు కెరియర్ టర్నింగ్ పాయింట్ గా మారే ఆస్కారం ఉంది. ఈసినిమా నిజంగానే రియల్ హిట్ గా మారి కలక్షన్స్ పరంగా సంచలనాలు క్రియేట్ చేయగలిగితే రానున్న రోజులలో అల్లు అర్జున్ పరుశురామ్ ల కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయం అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: