బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్నసినిమా భారత్. భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సల్మాన్ఖాన్ తన లేటెస్ట్ మూవీ భారత్ టీజర్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాను మాల్టాలో షూట్ చేస్తున్నారు. 1940ల్లో భారతదేశం, విభజన సందర్భంగా ఎదురైన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘కొన్ని బంధాలు మట్టితో పెనవేసుకుంటాయి.. మరికొన్ని రక్త సంబంధంతో ముడిపడి ఉంటాయి. నాకు ఆ రెండు బంధాలు ఉన్నాయి’ అన్న సల్మాన్ వాయిస్ ఓవర్తో టీజర్ ముగుస్తుంది. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ముందుగా ప్రియాంక చోప్రాని హీరోయిన్ అనుకున్నారు. ప్రియాంక తప్పుకోవడంతో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది.
టబు, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2019 రంజాన్ కు ఈ చిత్రాన్ని విడుదుల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో సల్మాన్ ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో సల్మాన్ సరసన కత్రినా, దిశాపటానీలు నటిస్తున్నారు. టబు, సునిల్ గ్రోవర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీని వచ్చే యేడాది ఈద్కు విడుదల కానుంది.
Kuch Rishte Zameen se hote hai, Aur kuch Khoon se.. Mere Paas Dono Thee ! कुछ रिश्ते ज़मीन से होते है, और कुछ खून से.. मेरे पास दोनो थे !@Bharat_TheFilm @aliabbaszafar @atulreellife #KatrinaKaif #Tabu @DishPatani @WhoSunilGrover @norafatehi @nikhilnamit @reellifeprodn @tseries pic.twitter.com/myeyEpWdPx
— Salman Khan (@BeingSalmanKhan) August 15, 2018