తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు రీల్ లైఫ్ లో ఎంత సీరియస్ గా ఉంటారో..రియల్ లైఫ్ మాత్రం తన కుటుంబం అంటే ఎంతో ప్రేమతో వ్యవహరిస్తుంటారు.  తన సినిమా ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత భార్యాపిల్లలతో విదేశాల్లో కొన్ని రోజులు సంతోషంగా గడిపి వస్తుంటారు.  ముఖ్యంగా మహేష్ బాబు కి పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార అంటే పంచ ప్రాణాలు..తన కూతురు అచ్చం తన తల్లిలా ఉంటుందని ఎన్నో సార్లు స్టేట్ మెంట్ ఇచ్చారు. 

ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనొక్కడినే’ చిత్రంలో గౌతమ్ కృష్ణ..మహేష్ చిన్ననాటి పాత్ర పోషించాడు.  ఆ తర్వాత మళ్లీ ఏ చిత్రంలోనూ కనిపించలేదు.  వాస్తవానికి మహేష్ బాబు తన చిన్నతనంలోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు.  ఇక తన సహనటి అయిన నమ్రతా శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మహేష్ బాబు. 
Related image
తన పిల్లలు గౌతమ్, సితారలను మహేష్ ఎంత గారాబంగా పెంచుతున్నాడో అతని భార్య నమ్రత గతంలో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో చెప్పింది. తాజాగా మహేష్ బాబు తన పిల్లలతో గడిపిన ఓ ఫోటో పోస్ట్ చేసింది.  అయితే ఆ పోస్ట్ లో తాను కాదన్న వారి కోరికను తీర్చుకునేందుకు తండ్రి వద్ద పంచాయితీ పెట్టారని తెలిపింది.  తను ఏం వద్దని చెప్పింది? వారు ఏం కావాలని అడిగారు? అన్న విషయాలు తెలియరాలేదు. ఈ చిత్రంలో మహేష్ తన బిడ్డలతో కలసి గోవాలోని ఓ కాసినో వద్ద ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: