ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న అర‌వింద స‌మేత వీర రాఘ‌వ చిత్రం టీజ‌ర్‌ను 72స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్బంగా ఈ రోజు విడుద‌ల చేశారు.  టీజర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఆరు లక్షల వ్యూస్ తో దుమ్మరేపింది.  అయితే ఈ టీజ‌ర్‌లో యంగ్ టైగ‌ర్‌ తారక్‌ కత్తి పట్టుకుని పరిగెడుతున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  జగపతి బ్యాగ్ డ్రాప్ డైలాగ్స్.. ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?’ అని జగపతిబాబు చెప్తున్న డైలాగ్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. 


ఆ తర్వాత ఎన్టీఆర్ డైలాగ్స్..‘కంటపడ్డానా కనికరిస్తానేమో..వెంటపడ్డావో నరికేస్తావోబా..’ అంటూ తారక్‌ చెప్తున్న డైలాగ్ తో దుమ్మురేపాడు.  హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.తారక్, ఇతర తారాగణంపై రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ టీజర్ లో మరో ప్రత్యేకత ఉంది..అదే కమెడీ హీరో సునీల్.  ఆ మద్య ఇండస్ట్రీలోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా మారారు. 


ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన సునీల్ ఈ మద్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు.  దాంతో తన ప్రాణ స్నేహితుడైన త్రివిక్రమ్ ‘అరవింద సమేత’లో మంచి పాత్ర ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్నేహితుడిగా నటిస్తున్న సునీల్ గతంలో పండించిన కామెడీ పండించబోతున్నాడట. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదే యాసలో తారక్‌ సంభాషణలు చెప్పబోతున్నారు. 


తెరపై మరోసారి సిక్స్‌ ప్యాక్‌తో సందడి చేయబోతున్నారు. ఇందుకోసం ఆయన చాలా రోజుల పాటు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేసిన విషయం తెలిసిందే.  మొత్తానికి సునీల్ ఇప్పుడు కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా..లేదా మళ్లీ హీరోగా తన సత్తా చాటుతారా అన్నది తెలియాాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: