‘శ్రీవివాస కళ్యాణం’ ఫ్లాప్ తరువాత నితిన్ పరిస్థితి పూర్తి అయోమయంలో పడిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీ ఇచ్చిన షాక్ తో ప్రస్తుతం నితిన్ ఎవర్ని కలవడానికి ఇష్టపడటం లేదు అని టాక్. వరసగా హిట్స్ వస్తేనే నిలదొక్కుకోగలిగే ఫిలిం ఇండస్ట్రీలో నితిన్ సుమార్ 16 ఫ్లాపుల తరువాత ‘ఇష్క్’ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ మూవీలతో ట్రాక్ లోకి వచ్చాడు.
అయితే ఆతరువాత తిరిగి వరస ఫ్లాపులు రావడంతో మధ్యలో వచ్చిన ‘అ ఆ’ ఇచ్చిన సక్సస్ ఆనందం నితిన్ కు ఎక్కువకాలం నిలబడలేదు. ఎట్టి పరిస్థుతులలోను హిట్ కొట్టి తీరాలి అన్న కసితో చేసిన ‘శ్రీనివాస కళ్యాణం’ ఫ్లాప్ అవ్వడం ఒక కారణం అయితే ఆసినిమాను కేవలం దిల్ రాజ్ సినిమాగా గుర్తించి మీడియా ప్రచారం చేసింది కానీ అందులో హీరోగా నటించిన గురించి అటు మీడియా కాని ఇటు ప్రేక్షకులు కానీ పట్టించుకోక పోవడం నితిన్ కు ఒక షాక్ గా మారింది అని అంటున్నారు.
దీనితో టాప్ యంగ్ హీరోగా పేరున్నా ఎక్కడో ప్లానింగ్ లో తేడా ఉంది అన్న విశ్లేషణలతో నితిన్ ప్రస్తుతం రోజులు గడుపుతున్నట్లు టాక్. అందుకే ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు నితిన్ ఒక మాష్టర్ ప్లాన్ ఆలోచించినట్లు సమాచారం. తనకు సరైన గైడెన్స్ ఉన్నా సరైన ప్రచారం లేదని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఉదాహరణగా ‘శ్రీనివాస కళ్యాణం’ రిలీజ్ సమయంలో దిల్ రాజు గురించి మాట్లాడుకున్నంతగా జనం నితిన్ గురించి మాట్లాడలేదు అన్న అభిప్రాయం రావడంతో అతడు తన పబ్లిసిటీ టీమ్ ని బలోపేతం చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారట.
యువ హీరోలంతా పక్కాగా పీఆర్ ని మెయింటెయిన్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న నేపధ్యంలో అదే తీరుగా ఇప్పుడు నితిన్ కూడా తన పీఆర్ ని బలోపేతం చేసుకునే ప్లాన్ లో ఉన్నాడని టాక్. దీనికి సంబంధించి నితిన్ రకరకాల ప్లాట్ ఫామ్ లలో తనకు ప్రచారం పెంచుకునే యోచనలో ఉన్నాడట. అందుకోసం పెర్ ఫెక్ట్ పిఆర్ టీమ్ ని డిజైన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ఎంత గొప్ప పిఆర్ టీమ్ ఉన్నా నటించే సినిమా కథలో దమ్ము లేనప్పుడు ఎన్ని ప్రయోగాలు చేసినా అవి ఫలించవు అన్న విషయం నితిన్ కు తెలియదు కాబోలు..