ఈ మద్య చిన్న సినిమాలతోనే సూపర్ డూపర్ హిట్స్ కొడుతున్న దర్శకులు తర్వాత పెద్ద బ్యానర్ లో ఛాన్స్ దక్కించుకుంటున్నారు.  పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించాయి.  పెద్ద హీరోల సినిమాల స్థాయిలో కలెక్షన్లు రాబట్టాయి.  తాజాగా దర్శకుడు పరశురామ్  ‘గీత గోవిందం’తో మంచి విజయం సాధించి ప్రేక్షకులతో పాటు ప్రముఖల దగ్గర నుంచి కూడా విలువైన ప్రశంసలను అందుకుంటున్నారు. 
Image result for geeta govindam
‘గీతాగోవిందం’ ఎన్నో చిక్కులను అధిగమించి థియేటర్లో రిలీజ్ అయ్యింది..అయినా కూడా కంటెంట్ బాగుండటంతో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది.   దాంతో పరశురామ్ తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.  కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం పరశురాం తరువాతి చిత్రం మంచు విష్ణుతో ఉంటుందని తెలుస్తోంది. మంచు విష్ణు మొదటి నుంచి కూడా కామెడీకి ప్రాధాన్యతనిస్తూ .. యాక్షన్ ఎంటర్ టైనర్లు చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన 'ఆచారి అమెరికా యాత్ర' ఆడియన్స్ ను నిరాశ పరిచింది. దాంతో తన తదుపరి చిత్రమైన 'ఓటర్'పై విష్ణు దృష్టి పెట్టాడు.
Image result for manchu vishnu
ఈ చిత్రం తరువాత ఆయన 'కన్నప్ప' సినిమా చేయనున్నట్టు వార్తలు జోరుగా వినిపించాయి. కాకపోతే దానికన్నా ముందు  పరశురామ్ దర్శకత్వంలో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు విష్ణు.  ఈ సినిమాకి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై పరశురామ్ కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.  శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకం పై మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిచనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: