బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ‘భరత్ అనే నేను’ సినిమాతో క్రేజీ బ్యూటీగా మారిపోవడంతో ఆమెకు ప్రస్తుతం టాప్ హీరోల పక్కన వరస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్‌ తో బోయపాటి దర్శకత్వంలో ఒక భారీ మూవీలో నటిస్తున్న ఈమె ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తి కరమైన న్యూస్ ను లీక్ చేసింది. 
ఇటీవలే 26వ జన్మదినం
ఈమధ్యచరణ్ సినిమాకు సంబంధించి  బోయపాటి శ్రీను ఒక భావోద్వేగమైన సన్నివేశాన్ని కైరా అద్వాని పై చిత్రీకరించాడట. అయితే  ఈసన్నివేశం అత్యంత కీలకం కావడంతో బోయపాటి కైరాను 32 సార్లు ఏడ్పించి 32 టేక్స్ తీసుకున్నాడట. ఆసన్నివేశం చాలా ముఖ్యమైనది కావడంతో కైరా అద్వాని ఎన్నిసార్లు నటించినా ఆ సీన్ బాగుండలేదు అంటూ బోయాపాటి పెట్టిన టార్చర్ వివరించింది కైరా. 
లస్ట్ స్టోరీస్‌తో
ఈమధ్య నెట్‌ ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే లవ్ స్టోరీస్ అనే వెబ్‌ సిరీస్‌లోనటించి నప్పుడు కూడ తాను అంత ఖంగారు పడలేదు అంటూ బోయపాటి టార్చర్ తాను ఇప్పట్లో మరిచిపోలేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. లస్ట్ స్టోరిస్‌ లోని తన నటనకు క్రిటిక్స్ ప్రశంసలు లభించినా బోయపాటి ప్రశంసలు తనకు రావడానికి తాను పడ్డ కష్టాన్ని వివరించింది. 
32 సార్లు ఏడ్పించాడు
 బోయపాటి చరణ్ ల కాంబినేషన్ రూపొందుతున్న కొన్ని టైటిళ్లు ప‌రిశీల‌న‌లో ఉన్నా మ‌రింత మెరుగైన మూవీ టైటిల్ కోసం బోయ‌పాటి ఎదురు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. చిరు పుట్టినరోజు అని ఖంగారు టైటిల్‌ ని ప్ర‌క‌టించకుండా అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ కోసం బోయపాటి తీవ్ర ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంతున్న ఈమూవీ షూటింగ్ కు ఈ మధ్య కురుస్తున్న వానలు అడ్డంకిగా మారాయి అని తెలుస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: