మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైరా' చిత్రం టీజర్ విడుదలైంది. నెట్టింట దూసుకెళుతున్న ఈ టీజర్ ఇప్పుడు దుమ్ము రేపుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ రికార్డుల మోత మొదలు పెట్టింది. టీజర్లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా మెగాస్టార్ చిరంజీవిని చూసి మురిసి పోతున్నారు మెగా అభిమానులు.
మరోపక్క టీజర్పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.రేపు చిరంజీవి జన్మదినం సందర్భంగా ఈ ఉదయం 11: 30 గంటలకు సైరా నరసింహారెడ్డి టీజర్ విడుదుల చేశారు. టీజర్ క్షణాల్లో వైరల్ గా మారింది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్ లో మెగాస్టార్ చిరంజీవి పవర్ ఫుల్ గా కనిపించాడు. టీజర్పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అందరినీ ఆకట్టుకుంటూ వేగంగా దూసుకుపోతున్న ఈ టీజర్ కేవలం 5 గంటల్లోనే 50 లక్షలకు పైగా డిజిటల్ వ్యూస్ రాబట్టడం విశేషం.
టీజర్పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది చిత్రయూనిట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మిస్తున్నారు.దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ వంటి హేమా హేమీలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్. 2019 లో ఈ చిత్రం విడుదల కానుంది.