తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఎంత క్రేజీ హీరోనో అందరి కీ తెలిసిందే.  పెళ్లి చూపులు చిత్రంలో అమాయకుడిగా నటించిన విజయ్ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో బోల్డ్, అగ్రెసీవ్, కోపిష్టిగా నటించాడు.  ఇక పరుశరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీతాగోవిందం’లో అద్భుతమైన కామెడీ తో పాటు సెంటిమెంట్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.  ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వసూళ్లు షేక్ చేస్తున్నారు.  పెద్ద హీరోల కలెక్షన్ల స్థాయిలో రాబడుతున్నాయి.  ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపుతుంది ‘గీతాగోవిందం’. 

తాజాగా ఈ సినిమా రూ.75 కోట్లను (గ్రాస్) వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. గీత గోవిందం విదేశాల్లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోందని వెల్లడించింది. మ్మిది రోజుల్లో ఈ చిత్రం ట్రిపుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంద కోట్ల క్లబ్‌ దూసుకెళ్తున్నది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి పరుశురాం దర్శకత్వం వహించారు.
Image result for గీత గోవిందం
విజయ్‌కి జంటగా రష్మిక మందన్న నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా విడుదలై అఖండ విజయం వైపు దూసుకెళ్తున్నది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ.. గీత గోవిందం సినిమా అమెరికాలో ఇప్పటివరకూ 11.98 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. గత మంగళవారం ఈ సినిమా ఏకంగా 1,19,247 డాలర్లు రాబట్టిందని వెల్లడించారు. ఓవరాల్ గా ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచిందన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: