సాధారణంగా తమ అభిమాన హీరో కలవడమే పెద్ద సంతోషం..అలాంటిది ఆ అభిమాన హీరో తమ కూతురుకి నామకరణం చేయడం అంటే ఆ అభిమానికి ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ప్రజలు గుండెల్లో ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. అంత గొప్ప హీరో ఇప్పుడు మళ్లీ వెండి తెరపై మెరిసిపోతున్నారు. ఇప్పటికే ‘ఖైదీ నెంబర్ 150’తో దుమ్మురేపిన చిరంజీవి త్వరలో ‘సైరా నరసింహారెడ్డి’తో మారో సంచలనం సృష్టించబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. కేవలం చిరంజీవి హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో ఒకరు కొంతం ప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామానికి చెందిన ఆయన, 20 సంవత్సరాల నుంచి చిరంజీవి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే కొంతం ప్రసాద్ కి ఆగస్టు 22 .. 2017లో ఆయనకి ఓ పాప జన్మించింది.
ఇక ఆగస్టు 22 మెగాస్టార్ పుట్టిన రోజు అని అందరికీ తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజునాడే తనకి పాప పుట్టడం వలన, ఆయనతోనే ఆ పాపకి నామకరణం చేయించాలని ప్రసాద్ భావించాడు. అప్పటి నుంచి చిరంజీవి తో తన పాపకు నామకరణం చేయించాలని ఎంతో ఉత్సాహ పడుతున్నారు..ఎట్టకేలకు ఆయన కష్టం ఫలించింది..మెగాస్టార్ నుంచి ఆహ్వానం అందింది. దాంతో ప్రసాద్ తన భార్య బిడ్డలతో చిరంజీవిని కలుసుకున్నాడు. చిరంజీవి ఆ పాపకి 'ఆరుషి' అని నామకరణం చేసి .. ఆశీస్సులు అందజేశారు. ప్రసాద్ దంపతులు ఆనందంతో పొంగిపోతూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశారు.