భారతీయ చలన చిత్ర రంగంలో విశ్వనటుడుగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పుడు నటుడిగానే కాదు..రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు. ఇప్పటికే ఆయన 'మక్కల్ నీధి మయ్యం' పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్య ‘విశ్వరూపం 2 ’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఆయనే దర్శక, నిర్మాతగా వ్యవహరించారు. అయితే సినిమా తెలుగు లో అనుకున్న విజయం మాత్రం సాధించలేక పోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన ఇద్దరు కూతుర్లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు.
శృతి హాసన్, అక్షర హాసన్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో శృతి హాసన్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అక్షర హాసన్ బాలీవుడ్, కోలీవుడ్ లో నటించింది. ఇక 'రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్లో గతంలో ఎన్నో చిత్రాలు రూపొందాయి. ఆ సినిమాలు చాలావరకూ ఘన విజయాలను అందుకున్నాయి. తాజాగా కమల్ హాసన్ ఒక భారీ సినిమాను నిర్మించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి.
పూజా కుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఆ సినిమాను ఈ రోజు ఉదయం లాంచ్ చేశారు. విక్రమ్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా అక్షర హాసన్ చేయనుంది. ఈ సినిమాకి రాజేశ్ సెల్వ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు