ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ప్రముఖ నటులు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా అన్నపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  ఆయన మృతితో టాలీవుడ్ ఒక్కసారే షాక్ కి గురైంది.  ఈ విషాద సంఘటన మరువక ముందే ప్రముఖ మహిళా దర్శకురాలు బి.జయ గుండెపోటుతో నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. 


దర్శకురాలు, ఫిల్మ్ జర్నలిస్ట్ బి.జయ భర్త, పీఆర్వో బిఏ రాజును మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు.  ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, జయ తమ మధ్య లేకపోవడం జీర్ణించుకోలేని విషయమని, ఆమె మృతి వార్త తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఈ వార్త నిజమో కాదో తెలుసుకుందామని ఫోన్ చేస్తే ఈ విషాద వార్త నిజమేనని తెలిసిందని అన్నారు. 


ఇప్పటికే తన సోదర సమానులు నందమూరి హరికృష్ణ మరణం జీర్ణించుకోలేని సమయంలో ఇప్పుడు జయ మరణం హృదయాలను కలచి వేస్తుందని అన్నారు. జయ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. అలాంటి వ్యక్తి లేకపోవడం చిత్రపరిశ్రమకు తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. జయ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. కాగా, ఆమె భౌతిక ఖాయాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శించుకున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: