నటులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే.  ఆయన మరణం టీడీపీ కార్యకర్తలుకు, అభిమానులకు తీరని దుఖాఃన్ని మిగిల్చింది.   ఇక నందమూరి కళ్యాన్ రామ్, జూ.ఎన్టీఆర్ లకు తండ్రితో ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.  వారి ప్రతి సినిమా ఈవెంట్ కి  తండ్రిని తప్పకుండా పిలవడం ఆనవాతీగా పెట్టుకున్నారు.  అలాంటి తండ్రి చనిపోయిన విషయాన్ని వారు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. 
Image result for nandamuri harikrishna
దాంతో తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రం షూటింగ్ ఆగిపోతుందని అందరూ భావించారు.  ఈ విషయంలో దర్శకులు త్రివిక్రమ్ సైతం ఎన్టీఆర్ ని ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది.  తాజాగా ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తమ తండ్రి చనిపోయిన దుఖఃంలో ఉండి కూడా నిర్మాతలకు ఎలాంటి నష్టాలు వాటిల్ల కుండా ఉండేందుకు ఎన్టీఆర్ ఈ రోజు నుంచి షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు.  ఇక, కల్యాణ్ రామ్ కూడా తన కొత్త చిత్రం షూటింగ్ లో తిరిగి పాల్గొంటారని తెలుస్తోంది. సోమవారం నుంచి ఈ చిత్ర షూటింగ్ లో ఆయన పాల్గొననున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: