మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివల కాంబినేషన్ లో ప్రారంభం కావలసి ఉన్న చిరంజీవి 152వ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే మెగా అభిమానుల ఆగ్రహానికి గురి కావడం ఆశ్చర్యంగా మారింది. ఈమూవీకి సంబంధించిన కథ ఫైనల్ కావడంతో ఈమూవీలో నటించే నటీనటుల ఎంపిక పై కొరటాల శివ దృష్టి పెట్టాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని వచ్చే సంవత్సరం 2019 జనవరి 1న ప్రారంభించాలని కొరటాల భావిస్తున్నట్లు టాక్.
ఈమూవీ హీరోయిన్స్ విషయంలో అనేక ఆలోచనలు జరిగిన తరువాత చిరంజీవి పక్కన ఈమూవీలో హీరోయిన్స్ గా నటించేందుకు తమన్నా నిత్యామీనన్ లను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈవార్తల లీకులు చిరంజీవి అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. దీనికి కారణం ఇప్పటికే ప్రేక్షకులలో ఐరన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకుని ప్రస్తుతం చాల సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేస్తున్న తమన్నా చిరంజీవి పక్కన ఇమేజ్ పరంగా ఏవిధంగాను సరిపోదు అని మెగా అభిమానుల వాదన.
అంతేకాదు చిరంజీవి ముందు నిత్యామీనన్ ఏవిధంగాను బాగుండదు అనీ హీరోయిన్స్ గా వీరిద్దరి ఎంపికా చిరంజీవి కొరటాలల క్రేజీ ప్రాజెక్ట్ కు ఇమేజ్ పరంగా హాని చేస్తుందని మెగా అభిమానులు విపరీతంగా మదన పడుతున్నారు. ఈవిషయాలను మెగా కాంపౌండ్ దృష్టికి తీసుకు రావడానికి కూడ తమవంతు ప్రయత్నాలను అప్పుడే చిరంజీవి ఫ్యాన్స్ మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే మెగా అభిమానుల అభిప్రాయాలు కొరటాల దృష్టికి రావడంతో అతడి స్పందన వేరుగా ఉంది అని తెలుస్తోంది. చిరంజీవి చాలమంచి డాన్సర్ కాబట్టి అతడితో సరిసమానంగా స్టెప్స్ వేయడానికి గ్లామర్ పరంగా తమన్నాను ఎంపిక చేసినట్లు అదేవిధంగా నటన పరంగా చాల స్కోప్ ఉన్న మరో హీరోయిన్ పాత్రగా నిత్యామీనన్ ను ఎంపిక చేసినట్లు కొరటాల చెపుతున్నట్లు టాక్. అయితే రోజురోజుకు పెరిగిపోతున్న మెగా అభిమానుల అసహనాన్ని కొరటాల ఎంత వరకు సరి చేస్తాడో చూడాలి.