బాలీవుడ్ లో గత కొంత కాలంగా చారిత్రాత్మక చిత్రాలు వరుసగా వస్తున్నాయి.  ఈ సంవత్సరం సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ ఎన్ని వివాదల్లో చిక్కుకుందో అందరికీ తెలిసిందే. రాజ్ పూత్ లను అవమానిస్తూ ఈ చిత్రం తీస్తున్నారని అప్పట్లో పెను వివాదాలు చెలరేగాయి. దీపికా పదుకొనె, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమా అన్ని ఇబ్బందులు ఛేదించుకొని రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై వివాదం సృష్ణించిన కర్ణిసేననే ‘పద్మావత్’ అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. 
Image result for manikarnika
తాజాగా క్రిష్ దర్శకత్వంలో కంగనా రౌనత్ లీడ్ రోల్ లో ‘మణికర్ణిక’ చిత్రం తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉంది.  ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించడానికి డీల్ కుదరడంతో మణికర్ణిక డైరెక్టర్ క్రిష్.. ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. అంతే కాదు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర వహిస్తున్న నటుడు సోనూ సూద్ కూడా తప్పుకోవడంతో మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి.  కంగనా రనౌత్, సోనూ సూద్ మధ్య విభేదాలు మణికర్ణిక నిర్మాతలకు బాగానే నష్టం చేకూర్చినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.

ఈ మూవీ తొలి స్క్రీనింగ్ తర్వాత విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన స్క్రిప్ట్‌కు సరిగ్గా సరిపోలేదని నిర్మాతలు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. దీంతో కొన్ని సీన్లను స్క్రిప్ట్‌కు సరిపడినట్లు రీషూట్ చేయాలని నిర్ణయించారు.  కొంత భాగాన్ని కంగనా రనౌతే దర్శకత్వం వహిస్తున్నారనీ సమాచారం.  అయితే  రీషూట్ 45 రోజుల షెడ్యూల్‌గా మారడంతో నిర్మాతలు అదనంగా మరో రూ.20 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోనూ సూద్ స్థానంలో వచ్చిన మొహమ్మద్ జీషాన్ ఆయూబ్‌తో రీషూట్ చేయాల్సి ఉంది.  కొన్ని యాక్షన్ సీన్లను తెరకెక్కించడానికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్‌ను కూడా తీసుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: