‘మా’ అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా ఆ సంఘం నిధులను మింగేశాడని, మెగా ఈవెంట్‌తో వచ్చిన నిధి నుంచి కొంత దుర్వినియోగం చేశాడని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో మా ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవ అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ మా ఎలక్షన్ కి సంబంధించిన ఫైట్ సోషల్ మీడియాలో రావడంతో ఒకదశలో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి..ఎట్టకేలకు పెద్దల జోక్యంతో మా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. 


మా అధ్యక్షుడిగా శివాజీ రాజా ఎన్నుకోబడ్డారు.   తాజాగా ‘మా’ (మూవీ ఆర్టిస్ అసోసియేషన్)లో వర్గ విబేధాలు మరోసారి రచ్చ రచ్చ చేస్తున్నాయి.  అమెరికాలో జరిగిన ‘మా’ టూర్ లో పెద్ద స్కాం జరిగిందని సీనియర్ నరేశ్, రాజేంద్రప్రసాద్ వర్గం ఆరోపించిన సంగతి తెలిసిందే.   ఈ ఆరోపణలపై శివాజీరాజా, శ్రీకాంత్ స్పందించారు.


'మా' రజతోత్సవంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఒకవేళ అవకతవకలు జరిగాయని నిరూపిస్తే ‘మా’ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటామని శివాజీరాజా, శ్రీకాంత్‌ ప్రకటించారు. అంతేకాదు, నిరూపిస్తే పెద్దమ్మ తల్లి సాక్షిగా గుండు చేయించుకుంటానని శివాజీ రాజా సంచలన ప్రకటన చేశారు. వీరిద్దరితో పాటు పరుచూరివెంకటేశ్వరరావు కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఇదిలా ఉంటే..వీళ్లకు కౌంటర్ ఇచ్చేందుకు సీనియర్ నరేష్ వర్గం   మీడియా ముందుకు వచ్చింది. మీడియా ముందుకు వచ్చే ముందు నరేష్ వర్గం చిరంజీవి ఇంటికి వెళ్లింది. ఆయనతో మాట్లాడినట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: