తెలుగు ఇండస్ట్రీలో యువహీరో నాగశౌర్య ‘ఛలో’చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. ‘ఊహలు గుస గుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’,‘చందమామ కథలు’ చిత్రాలతో మంచి విజయం అందుకున్న నాగశౌర్య తర్వాత వచ్చిన సినిమాలతో అపజయాలు అందుకున్నాడు. తమ సొంత బ్యానర్ లో ‘ఛలో’ చిత్రంతో అద్భుతమైన విజయం అందుకున్న నాగశౌర్య మరోసారి సొంత బ్యానర్ లో‘@నర్తనశాల’ చిత్రంతో భారీ డిజాస్టర్ చవిచూశాడు. కామెడీ జోనర్ లో వచ్చిన @నర్తనశాల పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు నాగశౌర్య.
అయితే ఆ అంచనాలు మొత్తం ఉల్టా తిరగడంతో మనోడికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. @నర్తనశాల డిజాస్టర్ అయినా..మనోడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం ఈయన కొత్త దర్శకుడు రాజా కొలసతోనే ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో శౌర్యకు జోడీగా కొత్తమ్మాయిలు నటిస్తున్నారు. ఓ హీరోయిన్ గా నివేదా థామస్ను తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది.
ఈ చిత్రంతో ఇద్దరు హీరోయిన్ల మద్య నలిగిపోయే పాత్రలో కడుపుబ్బా నవ్వించే విధంగా ఉండబోతుందట. ఈ చిత్రం కచ్చితంగా తనకు మళ్లీ బ్రేక్ తీసుకొస్తుందని నమ్ముతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. మొత్తానికి వరస ఫ్లాపులు వస్తున్నా కూడా శౌర్య దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఒక్కరు కాకపోయినా ఒక్కరైనా తనకు హిట్ ఇస్తారని నమ్ముతున్నాడు నాగశౌర్య.