రవితేజ శ్రీనువైట్లల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంధోనీ’ మూవీ రిలీజ్ కాకుండానే రవితేజ కళ్ళు తెరుచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 80శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ రషస్ చూసి రవితేజ ఏమాత్రం సంతృప్తిపడకపోవడమే కాకుండా శ్రీనువైట్లను తన పద్ధతి మార్చుకోవా అంటూ తీవ్ర అసహనంతో ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
amar akbar anthony america shooting completed - Sakshi
ఈమూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మాస్ మహారాజా అభిమానులకు పూర్తిగా నచ్చలేదు అన్న కామెంట్స్ రవితేజా దృష్టికి చేరినట్లు సమాచారం. దీనితో రవితేజా టెన్షన్ పడటమే కాకుండా ఈమూవీకి సంబంధించి త్వరలో విడుదల చేయబోతున్న ట్రైలర్ ను అయినా అందరికీ నచ్చేవిధంగా కట్ చేయమని మాస్ మహారాజ శ్రీనువైట్లకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. 
Ravi Teja and Srinu Vaitla next movie Title Confirm
అంతేకాదు ఈమూవీ ట్రైలర్ మేకింగ్ విషయంలో తన సూచనలు కూడ తీసుకోమని తనకు చెప్పకుండా ఈమూవీ ట్రైలర్ విడుదల చేయవద్దనీ శ్రీనువైట్లకు రవితేజా స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా శ్రీనువైట్లతో వచ్చిన అనుభవాలతో రవితేజ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి అని అంటున్నారు. ప్రస్తుతతరం ప్రేక్షకులు రొటీన్ సినిమాలను ఆదరించని పరిస్థుతులలో తన భవిష్యత్ సినిమాలకు సంబంధించి న్యూ ఫార్మేట్ స్క్రీన్ ప్లేతో కూడిన సినిమాలు తీయగల సమర్ధులైన దర్శకుల కోసం రవితేజ అన్వేషణ సాగుతున్నట్లు టాక్. 
Vi Anand
ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో రవితేజా మరొక కొత్త సినిమాను ప్రారంభించబోతున్న నేపధ్యంలో ఈమూవీలో తాను చేయబోతున్న తండ్రి కొడుకుల ద్విపాత్రాభినయంకు సంబంధించి నటించబోతున్న రెండు పాత్రలకు రెండు డిఫరెంట్ లుక్స్ తో పాటు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ను కూడ పెట్టుకోవడానికి రవితేజ స్టైలిస్ట్ లతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఒక విధంగా ‘అమర్ అక్బర్ ఆంధోనీ’ విడుదల కాకుండానే ఆమూవీ ఫలితం రవితేజాకు తెలిసి వచ్చినట్లు అనిపిస్తోంది.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: