‘గీత గోవిందం’ సక్సెస్స్ తో ఒకేసారి క్రేజీ డైరెక్టర్ గా మారిన పరుశు రామ్ తనకు వచ్చిన పాపులారిటీ సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం ఈ దర్శకుడు చాలామంది నిర్మాతలతో ఆడుతున్న దాగుడుమూతల గేం అని అంటున్నారు. 
Director parashuram facing problems 
తెలుస్తున్న సమాచారం మేరకు ‘గీత గోవిందం’ విడుదలకు ముందు పరుశు రామ్ ముగ్గురు నలుగురు నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లు ఈసమస్యలకు కారణం అని టాక్. ‘గీత గోవిందం’ ఈ స్థాయిలో విజయవంతం అవుతుందని పరుశు రామ్ కూడ ఊహించలేదు అన్న అభిప్రాయాలు ఉన్నాయి. 

దీనితో ఎందుకైనా మంచిదని పరుశు రామ్ ‘గీత గోవిందం’ విడుదలకు ముందు ఆడిన సేఫ్ గేమ్ ఇప్పుడు ఈ దర్శకుడుకు తలనొప్పిగా మారింది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు పరుసు రామ్ తాను అడ్వాన్స్ లు తీసుకున్న నిర్మాతలు అందరికీ వరసగా సినిమాలు చేస్తానని చెప్పినా వారు ఆవిషయాలు పట్టించుకోకుండా ముందుగా తమ సినిమాను మాత్రమే చేయాలని ఎవరికీ వారు పరుశు రామ్ పై ఒత్తిడి చేస్తూ ఉండటంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక పరుశు రామ్ తాను అడ్వాన్స్ లు పుచ్చుకున్న నిర్మాతలను తప్పించుకు తిరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
Srirastu subhamastu Director parasuram Special Interview
‘గీత గోవిందం’ మూవీకి సంబంధించి పరుశు రామ్ లాభాలలో వాటా తీసుకున్న నేపధ్యంలో పరుశు రామ్ కు ఈ మూవీ వల్ల సుమారు 5 కోట్లు వరకు లాభాలలో వాటాగా వస్తుందని అని అంటున్నారు. అయితే ఈవిషయాలు అన్నీ పూర్తిగా సెటిల్ కాకుండానే పరుశు రామ్ కు ఏర్పడ్డ ఈ నిర్మాతల అడ్వాన్స్ ల టార్చర్ నుండి ఎదో విధంగా తెలివిగా బయట పడకపోతే పరుశు రామ్ కెరియర్ కు తీవ్ర నష్టం జరిగే ఆస్కారం ఉంది అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: