తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విశాల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ మద్య రిలీజ్ అయిన ‘అభిమన్యుడు’ తో బంపర్ హిట్ కొట్టాడు విశాల్. ప్రస్తుతం పందెం కోడి సీక్వెల్ ‘పందెం కోడి 2’ తో రాబోతున్నాడు. తెలుగు, తమిళ నాట స్టార్ హీరోయిన్లు మనోడి సరసన నటించిన విషయం తెలిసిందే. తాజాగా హీరో విశాల్, దక్షిణాది హీరోయిన్ తమన్నా మరోసారి జోడికట్టబోతున్నారు..ఇప్పటికే ఈ ఇద్దరూ అంబల, కత్తిసండై, మదగజరాజ చిత్రాలలో నటించారు.
తాజాగా ఇప్పుడు సుందర్.సి. దర్శకత్వంలో కోలీవుడ్లో విశాల్,తమన్నా జంటగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే విశాల్, మిల్కీ బ్యూటీ కాంబోలో సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ ముద్దుగుమ్మకి తమిళంలో రెండు సంవత్సరాలుగా అవకాశాలే లేవు. ఇప్పుడు సుందర్ తన చిత్రంలో అవకాశం కల్పించారు. ఈ చిత్రమైనా విశాల్, తమన్నా జంటకు కలిసొస్తుందో లేదో వేచి చూడాలి.
తమన్నా తెలుగు, తమిళ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇక డిటెక్టీవ్, అభిమన్యుడుతో విశాల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మి నటిస్తున్న ‘పందెం కోడి2’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.