తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఆయన బాటలో ఇప్పుడు మెగాహీరోలు ఎంతో మంది వస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో చిరంజీవిలా చాలా తక్కువ మంది ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన హీరోలు..శ్రీకాంత్, రవితేజ,నాని మరికొంత మంది ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా కాకుండా క్యారెక్టర్ పాత్రలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అప్పుడప్పుడు హీరోగా కూడా కనువిందు చేస్తున్నాడు. తాజాగా శ్రీకాంత్ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న సినిమా ‘ఆపరేషన్ 2019’. బివేర్ ఆఫ్ పబ్లిక్… అనేది ఉపశీర్షిక.
ఈ చిత్రానికి కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే..ఈ చిత్రంలో మంచు మనోజ్కుమార్, సునీల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారట. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. సెన్సార్ పూర్తికాగానే విడుదల తేదీ ప్రకటించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ర్యాప్రాక్ షకీల్ స్వరపరిచిన ఓ పాటను సునీల్పై తెరకెక్కిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన విలేఖరుల సమావేశంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాజకీయ నేపథ్యంలో ‘ఆపరేషన్ 2019’ సినిమా చేస్తున్నాను. చాలా డిఫరెంట్గా, కొత్త గా ఈ చిత్రం ఉంటుంది. ‘ఆపరేషన్ దుర్యోధన’ తర్వాత మళ్లీ కొత్త గెటప్తో ఈ సినిమా చేశాను. ప్రేక్షకులు ఆలోచించే విధంగా కరణం బాబ్జి డైలాగులు బాగా రాశాడు.
ఇందులో మంచు మనోజ్, సునీల్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. దర్శకులు కరణం బాబ్జి మాట్లాడుతూ..దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ “శ్రీకాంత్తో నాకిది రెండో సిని మా. చెన్నైలో జరిగిన ఒక ఘటన ఆధారంగా నేను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. ఈ చిత్రంలో యజ్ఞ శెట్టి, దీక్షా పంత్, హరితేజ, సుమన్, కోట శ్రీనివాసరావు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరాః వెంకట్ ప్రసాద్, ఎడిటింగ్ః ఎస్.బి.ఉద్ధవ్.