యంగ్ హీరో సుధీర్ బాబుకు సూపర్ స్టార్ మహేష్ బావగా వచ్చే గుర్తింపుకంటే నటుడిగా ఎదగాలని ఎంతో కృషి చేస్తున్నాడు. తన మొదటి సినిమా నుండి లేటెస్ట్ గా విడుదల అయిన ‘సమ్మోహనం’ వరకు తన నటన విషయంలో చాలా పరిపక్వత సాధించాడు. ముఖ్యంగా తనకి ఎలాంటి కథలు సూట్ అవుతాయి అన్న విషయం పై మంచి క్లారిటీతో ఉంటూ తనని తాను ప్రూవ్ చేసుకోవడంలో సుధీర్ చాలామంది హీరోల కంటే మెరుగ్గా ఉన్నాడు.
వాస్తవానికి మహేష్ నుంచి పెద్దగా సహాయ సహకారాలు లేకపోయినా నటుడిగా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న సుధీర్ బాబు లేటెస్ట్ గా 'నన్ను దోచుకుందువటే' తో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈసినిమా రేపు ‘వినాయకచవితి’ రోజున విడుదల కావలసి ఉన్నా చైతు సమంతల వార్ మధ్య నిలబడటం కష్టం అన్న ఉద్దేశ్యంతో ఈ రేస్ నుండి తప్పుకున్నాడు.
దీనితో సుధీర్ కు ఎందుకో కాలం కలిసిరావడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మిగతా యువ హీరోలకి వచ్చినట్లు కెరియర్ టర్నింగ్ సినిమాలు సుధీర్ బాబుకు రావడంలేదు. తనలా కష్టపడ్డ నాని విజయ్ దేవరకొండ నిఖిల్ శర్వానంద్ ఇలా అందరికీ మంచి హిట్లు పడుతున్నా హిట్ టాక్ వచ్చిన ‘సమ్మోహనం’ కూడా అంతంత మాత్రం సినిమాగానే మారడం ఈయంగ్ హీరోను బాగా కలిచి వేస్తున్నట్లు టాక్. ఈనేపథ్యంలో 'నన్ను దోచుకుందువటే' సుధీర్కి కీలకంగా మారింది. అయితే ఈసినిమా కూడ జస్ట్ బాగుందని టాక్ తెచ్చుకుని యావరేజ్ వసూళ్లు తెచ్చుకునే సినిమాగా మారిపోతుందేమో అని సుధీర్ బాబు భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అదే జరిగితే సుధీర్ బాబును ఫిలిం ఇండస్ట్రీ సీరియస్గా తీసుకునే అవకశాలు ఉండవని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ‘నన్ను దోచుకుందువటే’ ట్రైలర్ కు మంచి పేరు వచ్చి ``అక్కడ యూఎస్ లో ట్రంపు - ఇక్కడ కార్తీక్`` అనే డైలాగ్ కు మంచి పేరు వచ్చినా సెప్టెంబర్ 21న విడుదలచేయాలి అని భావిస్తున్న ఈమూవీ విడుదల ప్లాన్స్ అయినా అన్ని అనుకున్నవి అనుకున్నాట్లుగా జరుగుతాయా లేదా అన్న టెన్షన్ లో సుధీర్ బాబు ఉన్నట్లు టాక్..