దర్శకరత్న  దాసరి నారాయణరావు మరణించి కనీసం రెండు రెండు సంవత్సరాలు కూడ అవ్వకుండానే దాసరి కుటుంబంలో ఏర్పడిన చిచ్చు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.   దాసరి నారాయణరావు కుమారుడు హరిహర ప్రభుకు ఇద్దరు భార్యలు అని తెలుస్తోంది. ఈ ఇద్దరి భార్యల మధ్య ఏర్పడ్డ వివాదం చిట్టచివరకు దాసరి ఆస్తుల చుట్టూ వివాదంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. 
Dasari Narayana Rao
తన భర్తతో తాను ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నెం 46 లో నివాసం ఉంటున్నామని దాసరి ప్రభు భార్య పద్మ తెలిపింది. కొన్ని రోజుల క్రితం ఆయన మొదటి భార్య సుశీల అర్థరాత్రి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి కర్రతో తనపై దాడి చేసిందని పద్మ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అని వార్తలు వస్తున్నాయి.  
Dasari Narayana Rao
అంతేకాదు ఆమెతో పాటు సంధ్య అనే మరో మహిళ కూడా వచ్చిందని తన భర్త ఎక్కడ అని గొడవ చేసిందని తాను కిచెన్ వైపు వెళుతుండగా కర్రతో తనపై దాడిచేసి గాయపరిచినట్లు పద్మ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈమె ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
dasari narayana rao death anniversary
అదేవిధంగా తన భర్త ఆస్థిలో తనకు వాటా ఉందని సుశీల వాదిస్తోంది. దాసరి జీవించి ఉన్నంత కాలం బయటకు రాని ఈవివేదాలు ఇప్పుడు దాసరి కుటుంబాన్ని రోడ్డు పైకి తీసుకు వచ్చినట్లు దాసరి అభిమానులు బాధ పడుతున్నారు. ఇది ఇలా ఉండగా దాసరి రెండవ కుమారుడు అరుణ్ కు నిన్న విడుదలైన ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీలో ఎటువంటి ప్రాధాన్యతా లేని ఒక చిన్న పాత్రలో నటింప చేయడం చూసినవారు ఎందరో హీరోలను టాప్ హీరోలుగా మార్చిన దాసరి తన కొడుకులను సరిగ్గా సెటిల్ చేయలేక పోవడం అత్యంత దురదృష్ట కరం అంటూ చాలామంది దాసరి అభిమానులు బాధ పడుతున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: